Telangana

News July 14, 2024

8 మంది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణకు మొండి చేయి: వినోద్ కుమార్

image

8 మంది ఎంపీలను గెలిపించినా BJP తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందని BRS నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉందన్నారు. అదే షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయిల్ రిఫేనరీ కంపెనీని ఏపీకి ఇస్తున్నారని.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

News July 14, 2024

షబ్బీర్ అలీకి వినతి పత్రం అందజేసిన విజయ డైరీ అధ్యక్షుడు

image

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీని విజయ డైరీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులను ప్రోత్సహించి పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం తరుఫున తగిన ప్రోత్సాహకాలు అందజేయాలని తిరుపతి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

News July 14, 2024

జాతీయ అవార్డు అందుకున్న RIMS వైద్యుడు

image

ఆదిలాబాద్‌ RIMS వైద్యుడు జాతీయ అవార్డు అందుకున్నాడు. RIMS పాథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డా.అరుణ్ కుమార్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఎక్సలెన్స్ విభాగంలో జాతీయ అవార్డు- భారతదేశపు ఉత్తమ వైద్యుల అవార్డు 2024 అందుకున్నారు. ఈ అవార్డు కోసం దేశం నుంచి 126 నామినేషన్లు రాగా దాంట్లో డా.అరుణ్ కుమార్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. RIMS డైరెక్టర్ జైసింగ్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆయన్ను అభినందించారు.

News July 14, 2024

ఆ వార్తలు అవాస్తవం: ఎంపీ రవిచంద్ర

image

ఖమ్మం: బీఆర్ఎస్‌ని బీజేపీ పార్టీలో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఇటువంటి వార్తలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలో కలుస్తుందన్న వార్తలు ఊహాజనితమైనవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. 

News July 14, 2024

మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులోని అరుణాచల ఆలయానికి గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 19న MBNR, NGKR డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ శ్రీదేవి శనివారం తెలిపారు. నూతన BS6 బస్సులను10 ఏర్పాటు చేశామని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.https://www.tsrtconline.in ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు.

News July 14, 2024

సిద్దిపేట నుంచి అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

image

సిద్దిపేట నుంచి ఈనెల 19న సాయంత్రం 4 గంటలకు అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కాణిపాకం, వేలూరు శ్రీ మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్, పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదక్షిణ, 22న జోగులాంబ శక్తిపీఠం దర్శనం ఉంటుందని వివరించారు.

News July 13, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు!!

image

♥గద్వాల:ముగ్గురు విద్యార్థులకు పాముకాటు
♥గండీడ్:ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
♥KTRను కలిసిన గద్వాల్ భారాస నేతలు
♥గద్వాలలో బీటెక్ స్టూడెంట్ SUICIDE’
♥ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహర్రం సందడి
♥6 గ్యారెండీలపై అధికారుల ప్రత్యేక ఫోకస్
♥ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు
♥డ్రగ్స్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక నిఘా
♥మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు:SIలు
♥నూతన పాఠశాలలో చేరిన టీచర్లకు ఘన సన్మానం

News July 13, 2024

ఏటూరునాగారంలో ఘోర ప్రమాదం.. పరారీలో కంటైనర్ డ్రైవర్

image

ఏటూరునాగారం మండలం జాతీయ రహదారిలోని హైవే ట్రీట్ వద్ద శనివారం రాత్రి ఆటో, కంటైనర్ ఢీకొనగా<<13623871>> ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాహనాన్ని ప్రమాద స్థలం వద్ద డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. కాగా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద స్థానికులు కంటైనర్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వాజేడు ఎస్సై హరీశ్ తెలిపారు.

News July 13, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు.!

image

◆ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం
◆ మంచిర్యాలో రైలు కిందపడి యువకుడి మృతి
◆ బేలలో 20 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
◆ నిర్మల్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ◆ తాంసిలో పిడుగుపాటుకు 12 మేకలు మృతి
◆ మంచిర్యాల: చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ ◆ నిర్మల్: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
◆ ఆదిలాబాద్‌లో నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
◆ ఆసిఫాబాద్‌లో ఐదుగురు జూదరుల అరెస్ట్.

News July 13, 2024

హుజూరాబాద్: బీరు సీసాలో పురుగు!

image

హుజూరాబాద్ పట్టణంలోని వైన్ షాపులో ఓ వ్యక్తి బీరు తాగుతుండగా పురుగు వచ్చింది. గమనించి అతడు ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. వెంటనే ఆ బీరును పట్టుకెళ్లి వైన్ షాపులో చూపించగా సదరు షాపు నిర్వాహకుడు దాని బదులు వేరే బీర్ ఇచ్చాడు. ఈ విషయం హుజూరాబాద్ పట్టణంలో వైరల్‌గా మారింది.