Telangana

News July 17, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

image

రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. రైతుల కష్టాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం సంతోషకరమన్నారు.

News July 17, 2024

నిజామాబాద్ జిల్లాలో 44,469 మందికి రుణమాఫీ

image

రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ పథకంలో నిజామాబాద్ జిల్లాలో 44,469 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. కాగా తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నారు. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ, ఆగస్టులో రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.

News July 17, 2024

కరీంనగర్ జిల్లాలో 36,918కి రుణ మాఫీ

image

కరీంనగర్ జిల్లాలో 36,913 మందికి రుణ మాఫీ కానుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారిగా కరీంనగర్ 2,536 మంది రైతులకు, చొప్పదండి 8,436, హుజురాబాద్ 12,502, మానకొండూర్13,381 మంది రైతులకు రుణమాఫీ కానుంది. రేపు రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. మాఫీపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 17, 2024

ప్రయాణికులారా.. సమస్యలు ఉంటే సంప్రదించండి

image

మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన కారణంగా ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి వీలుగా డిపోలకు చెందిన నంబర్లలో సంప్రదించాల్సిందిగా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఒక ప్రకటనలో ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం 99592 25979, మధిర 73829 25289, సత్తుపల్లి 9959 225990, భద్రాచలం 9959 225987, కొత్తగూడెం 9959 225982, మణుగూరు 89853 61796 సంప్రదించాలన్నారు.

News July 17, 2024

రైతు రుణమాఫీపై అనుమానాలు: మాజీ ఎమ్మెల్యే రేగా

image

రైతు రుణమాఫీపై సందేహాలున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆంక్షలు లేవంటూనే ఉత్తర్వులను సవరించడం లేదని మండిపడ్డారు. రైతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

News July 17, 2024

రామచంద్రాపురం: మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన నేతలు

image

రామచంద్రాపురం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావును మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కృష్ణ కాంత్, పఠాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శాలువతో సన్మానించి బొకే అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీధర్ చారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

News July 17, 2024

ముథోల్: Way2 News ఎఫెక్ట్.. బస్‌స్టాండ్‌లో విద్యుత్ దీపాలు

image

విద్యుత్ దీపాలు లేక ముధోల్ బస్‌స్టాండ్‌లో వారం రోజులుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీనిపై Way2 Newsలో ”అంధకారంలో ముథోల్ ఆర్టీసీ బస్టాండ్” అనే శీర్షికతో కథనం ప్రచురితం అయింది. కథనానికి స్పందించిన అధికారులు బుధవారం బస్టాండ్‌లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 17, 2024

మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 17, 2024

మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 14.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 10.8 మి.మీ, గద్వాల జిల్లా గట్టులో 3.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా తుడుకుర్తిలో 0.5 మి.మీ, వనపర్తి జిల్లా రేమోద్దులలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.