Telangana

News July 30, 2024

కామారెడ్డిలో వ్యభిచారం ముఠా అరెస్ట్

image

కామారెడ్డిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలిని దేవునిపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. ఐదుగురిని సఖి కేంద్రానికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మిగతా ముగ్గురిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

News July 30, 2024

నిర్మల్: కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

image

కూతురిపై తండ్రి లైంగిక దాడి చేసిన దారుణ ఘటన దిలావర్పూర్‌లో జరిగింది. SP జానకీ షర్మిల తెలిపిన వివరాలు.. గుండంపల్లికి చెందిన సంజీవ్(38) ఈనెల 19న రాత్రి తన కూతురి(14)పై లైంగిక దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న భార్య వారించగా.. తనను అడ్డుకుంటే రెండో భార్యను చంపినట్లు మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరించి కూతరిపై లైంగిక దాడిచేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.

News July 30, 2024

జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతుల వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో <<13735872>>SGTలకు<<>> పదోన్నతులు కల్పించడంతో ఉన్నత పాఠశాలల్లో చాలా వరకు సబ్జెక్టు నిపుణుల కొరత తీరనుంది. పీఎస్ HMతో పాటు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు,హిందీ,ఆంగ్లం,గణితం,భౌతిక,జీవ, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో అర్హులకు పదోన్నతి కల్పించారు. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు కూడా వారి అర్హతల ఆధారంగా SAలుగా పదోన్నతి కల్పించారు. MBNR-44,NGKL-55,GDWL-35, NRPT-53,WNPT-62 మంది టీచర్లు పదోన్నతులు పొందారు.

News July 30, 2024

మెదక్: రెండో విడతకు రెడీ

image

రెండో విడత రైతు రుణమాఫీకి ఉమ్మడి మెదక్ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేడు రూ. లక్షన్నర వరకు ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయనున్నారు. కాగా మెదక్ జిల్లాలో 2వ విడతలో 18,540 మంది రైతులకు రూ.183.26 కోట్లు, సంగారెడ్డి జిల్లాకు చెందిన 25,191మంది రైతులకు రూ. 268.35 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 27,875 మంది రైతులకు రూ. 277.21 కోట్లు రుణం మాఫీ కానుందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

News July 30, 2024

PDPL: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి

image

విష జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేటలో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేశ్-పద్మ దంపతులకు సాత్విక్(13) కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడు కొద్ది రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం KNR వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

News July 30, 2024

వరంగల్ జిల్లాలో విష జ్వరాలు

image

ఉమ్మడి WGL జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలతో కలిసి మొత్తం 1,300 పడకల వార్డులున్న MGMకు జిల్లాతో పాటు.. పొరుగు జిల్లాలు, AP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోగులు వస్తున్నారు. ప్రతిరోజు 50కి పైగా రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. జులై నెలలలో ఇప్పటి వరకు PHCలలో 41,152 ఓపీ రోగులు రాగా.. 1,856జ్వరాలు, 29వాంతులు, విరేచనాలు, 6డెంగీ, 2మలేరియా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు.

News July 30, 2024

జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతుల వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో <<13735872>>SGTలకు<<>> పదోన్నతులు కల్పించడంతో ఉన్నత పాఠశాలల్లో చాలా వరకు సబ్జెక్టు నిపుణుల కొరత తీరనుంది. పీఎస్ HMతో పాటు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు,హిందీ,ఆంగ్లం,గణితం,భౌతిక,జీవ, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో అర్హులకు పదోన్నతి కల్పించారు. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు కూడా వారి అర్హతల ఆధారంగా SAలుగా పదోన్నతి కల్పించారు. MBNR-44,NGKL-55, GDWL-35, NRPT-53,WNPT-62 మంది టీచర్లు పదోన్నతలు పొందారు.

News July 30, 2024

MBNR: 248 మంది SGTలకు పదోన్నతులు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మరో 248మంది <<13735934>>SGTలకు <<>>పదోన్నతులు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, ఖాళీల వివరాలను ప్రకటించి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. సోమవారం సాయంత్రం అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 30, 2024

సంగారెడ్డి: దిగొచ్చిన టమాటా.. సామాన్యులకు ఊరట

image

టమాట ధర ఎట్టకేలకు దిగి రావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, తదితర మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 40 పలుకుతుంది. కిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయ, ఆకు కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. ధరల పెరుగుదలను అరికట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News July 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి ఏజెన్సీలో వరదలపై అధికారులు సమీక్ష సమావేశం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం