India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అమీన్పూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి(31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్(7), సాత్విక్(6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
HYD నలు దిక్కుల అభివృద్ధి కోసం 30 వేల ఎకరాల భూమి అవసరమని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలియజేశారు. 350 కిలోమీటర్ల RRR పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మాస్టర్ప్లాన్ 2050 సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. HYD విస్తరణలో భాగంగా మొదటి దశలో 1000 ఎకరాలు అవసరమని దీనికి సంబంధించి భూసేకరణపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు.
HYD కాప్రా మండలం జవహర్నగర్ PS పరిధిలో 2021లో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అభిరామ్ దాస్కు కోర్టు జీవిత ఖైదు, రూ.60 వేలు జరిమానా విధించిందని పోలీసులు ఈరోజు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. కాగా 363, 366, 376(AB), 376(2)(m), 377 ఐపీసీ& పోక్సో Act కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీ పని చేసే అభిరామ్ ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు.
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు HYDలో పోస్ట్ కార్డ్స్ రాశారు. టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలతోపాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎంను కోరారు.
తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు HYD హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్ప్రైజ్ ప్రొక్యూర్మెంట్, సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ (JAGGAER) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మంత్రి ప్రారంభించారు. ‘ఒక్క టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు HYD గమ్యస్థానంగా మారిందని మంత్రి తెలిపారు.
గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్లో ఉన్న ఓ గోదాంలో ఈరోజు బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దాదాపు రూ.8 లక్షల పైగా విలువైన 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులు జప్తు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, ఫ్యాన్లు తదితర వస్తువులను గుర్తించారు. కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
HYD నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు, హీరో అక్కినేని నాగచైతన్య ఈరోజు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన విచారణలో భాగంగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలతో మేడారం దేవాలయ ప్రాంగణం నూతన డిజైన్ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు HYDలో పరిశీలించారు. డిజైన్లో అవసరమైన మార్పులపై చర్చించి, తగిన సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, పూజారుల అభిప్రాయం మేరకు ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.