India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు గురువారం ప్రారంభమై ఆగస్టు 7వరకు జరగనున్నాయి. కాగా జిల్లాలో 640 పోస్టులకు 7వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్లోని నాలెడ్జి పార్క్ స్కూల్లో 2,600 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. >> ALL THE BEST

వర్షాకాలం ప్రారంభమవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడంతో ఖమ్మం జిల్లా ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడటంతో ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో ఇప్పటి వరకు 18 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసే దివ్యాంగుల కోసం అధికారులు ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే డీఈఓ కార్యాలయ సీఎంఓ రాజశేఖర్ను ఇన్ఛార్జిగా నియమించారు. 137మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నారు.
వీరికి సహాయకుల (స్క్రైబ్స్)ను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం ఇంటర్ విద్యార్థులను
జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా నియమించింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో డీఈఓ సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెంలో డీఈఓ వెంకటేశ్వరాచారి పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు డీఈఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఖమ్మం 99512 12603, భద్రాద్రి జిల్లా అభ్యర్థులు 98857 57137కు సంప్రదించాలన్నారు.

DSC పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా ఆన్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులను ఉదయం 7.30 నుంచే లోనికి అనుమతిస్తారు. కాగా ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 100మంది విద్యార్థులు హాజరుకానున్నారు. >>ALL THE BEST

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న అర్చకుల బదిలీని నిలిపి వేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ అర్చకులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ జీవో విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలానికి చెందిన ఆలయ ఉప ప్రధానార్చకులు మురళీ కృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణ చార్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో భద్రాద్రి ఆలయ అర్చకుల బదిలీని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.

నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈసారైనా సాగునీరు అందుతుందా..? అని రైతులు ఎదురుచూస్తున్నారు. కృష్ణా నదికి ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల ప్రారంభమైనా.. సాగర్ ఆయా కట్టు రైతుల్లో అనుమానాలు తొలగడం లేదు. గతేడాది ఇలాగే ఆశలు ఊరించినా ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందలేదు. ఈసారి కూడా వరదలు వస్తాయా? ఆశలు నెరవేరుతాయా ..? అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.

సొంత గ్రామం కొండారెడ్డిపల్లి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖాముఖి అవుతారని వంగూరు మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్ తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.7వేల కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా సా.4 గంటలకు సొంత గ్రామం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కానున్నారు. రైతులతో మాట్లాడి తెలుసుకోనున్నారు.

భర్త మృతిని తట్టుకోలేక భార్య చెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం బంజేరుపల్లిలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. మల్లయ్య(75)మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం ఆయన అంత్యక్రియల నిర్వహణలో పాడె కడుతున్న సమయంలో మల్లయ్య భార్య రాజలచ్చమ్మ(70) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.