Telangana

News July 23, 2024

కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్‌కు గంపెడు ఆశలు

image

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. KNR నుంచి కేంద్ర మంత్రి ఉండటంతో ఈసారి కేంద్రం చూపు జిల్లావైపు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి KNRలో మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.

News July 23, 2024

HYD: స్టాక్స్‌లో లాభాలని రూ.16.73 లక్షలు లూటీ

image

స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

HYD: స్టాక్స్‌లో లాభాలని రూ.16.73 లక్షలు లూటీ

image

స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

NZB: జాగ్రత్త.. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి!

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రికార్డుస్థాయిలో ఓపీ నమోదువుతోంది. వారంరోజుల్లో 14,576 OP నమోదైంది. IP కింద 846 మంది చేరారు. వీరిలో జ్వరం, వాంతులు, విరేచనాలతో 3,093 మంది బాధితులు వైద్యం తీసుకున్నారు. కేవలం జ్వరంతోనే 138 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు 5009 మంది రోగుల నుంచి రక్తనమునాలు సేకరించారు. నిత్యం 700 నుంచి 800 మంది రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.

News July 23, 2024

పెన్‌గంగలో యువకుడి గల్లంతు

image

ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగలో గల్లంతైన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామానికి చెందిన శివ మిత్రులతో కలిసి ఆదివారం రాత్రి పెన్‌గంగాకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ఐతే సోమవారం యువకుడి కోసం డీడీఆర్ఎఫ్ బృందం పోలీసులు గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు.

News July 23, 2024

నల్గొండ: నేటి నుంచి ఆసరా ఫించన్ల పంపిణీ

image

నల్గొండ జిల్లా పరిధిలోని ఆసరా ఫించన్ దారులకు మంగళవారం నుంచి ప్రభుత్వం ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో పీడీ నాగిరెడ్డి తెలిపారు. స్థానిక తపాలశాఖ కార్యాలయాల్లో నేటి నుంచి ఈ నెల 29 వరకు ఫించన్లు పొందవచ్చని తెలియజేశారు. పంపిణీలో మధ్య దళారీల మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

News July 23, 2024

KNR: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయికృష్ణ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం గ్రామ శివారులోని ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 23, 2024

జఫర్గడ్ ఎస్సైని సస్పెండ్ చేసిన సీపీ

image

జఫర్గడ్ SI రవిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జఫర్‌గడ్ ఠానా పరిధిలోని భూ వివాదంలో నమోదైన కేసులో అలసత్వం వ్యవహరించడం, కేసు విషయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడం, బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరించడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ జరిపి అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సీపీ సస్పెండ్ చేశారు.

News July 23, 2024

MBNR: ప్రతి 15 రోజుల లక్కీ డిప్

image

ఈనెల 1 నుంచి టీజీఆర్టీసీ ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీంలో భాగంగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల ప్రతి 15 రోజుల లక్కీ డిప్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించారు. రీజియన్ పరిధిలో నిర్వహించిన ఈ లక్కీడ్రాలో లక్ష్మీదేవమ్మ, సుజాత, అర్షియాబేగం విజేతలుగా నిలిచారు. వీరికి సమాచారం ఇచ్చామని, త్వరలో బహుమతులు అందజేస్తామని అధికారులు తెలిపారు.

News July 23, 2024

పథకాలకు నిధుల కోసం జిల్లావాసుల నిరీక్షణ

image

ఖమ్మం జిల్లాలోని పడకేసిన అభివృద్ధి పనులు, నిలిచిపోయిన నిర్మాణాలు, సంక్షేమ పథకాల కోసం అర్హుల ఎదురుచూపులకు బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రకటించిన పథకాల అమలుకు నిధులు కేటాయిస్తారని భావిస్తుండగా.. జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి.