Telangana

News July 29, 2024

HYD: వివాహిత అనుమానస్పద మృతి

image

మెడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని వెంకట్ రెడ్డి నగర్‌లో 4 అంతస్థుల భవనం నుంచి దూకి దివ్య(29) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అంబర్పేట్ ప్రేమ్ నగర్‌కు చెందిన దివ్యకు రామంతపూర్ రామ్ రెడ్డి నగర్‌కు చెందిన నవీన్‌తో ఏప్రిల్ 24, 2024న పెళ్లైంది. ఈనెల 27న దివ్య మిస్ ఐనట్లు పుట్టింటి వారికి చెప్పారు. నేడు ఆత్మహత్య చేసుకోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు.

News July 29, 2024

HYD: వివాహిత అనుమానస్పద మృతి

image

మెడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని వెంకట్ రెడ్డి నగర్‌లో 4 అంతస్థుల భవనం నుంచి దూకి దివ్య(29) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అంబర్పేట్ ప్రేమ్ నగర్‌కు చెందిన దివ్యకు రామంతపూర్ రామ్ రెడ్డి నగర్‌కు చెందిన నవీన్‌తో ఏప్రిల్ 24, 2024న పెళ్లైంది. ఈనెల 27న దివ్య మిస్ ఐనట్లు పుట్టింటి వారికి చెప్పారు. నేడు ఆత్మహత్య చేసుకోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు.

News July 29, 2024

కోదాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ బీసీ హాస్టల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆనవాళ్లను బట్టి గుర్తించిన వ్యక్తులు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పట్టణ సీఐ రాము తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 29, 2024

ఇచ్చిన మాట నెరవేర్చేది కాంగ్రెస్ సర్కారే: వెలిచాల

image

ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ సర్కారు మాటమీద నిలబడుతుందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సర్కారు నెరవేరుస్తుందని తెలిపారు. మంగళవారం లక్షన్నరలోపు రైతుల రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయన్నారు.

News July 29, 2024

అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు

image

మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.

News July 29, 2024

జపాన్‌లో జరిగే పోటీలకు ఎంపికైన బోథ్ విద్యార్థిని

image

రాష్ట్ర స్థాయి సకురా సైన్స్ ప్రొగ్రామ్ పోటీలకు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రసజ్ఞ ఎంపికయ్యారు. గత సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్య పోటీలను నిర్వహించారు. రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటింది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి జపాన్ పర్యటనకు పంపనున్నారు.

News July 29, 2024

రేవంత్ పీసీసీ అయినా.. సీఎం అయినా అది కేసీఆర్ పుణ్య‌మే: హరీష్ రావు

image

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్య‌మే అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో హ‌రీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జ‌రిగాయని అన్నారు.

News July 29, 2024

మెదక్: ఫైనాన్స్ రుణం ఇస్తామని.. డబ్బులు కాజేశారు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామానికి చెందిన రావెల్లి నరసింహులుకు ఓ ఫైనాన్స్ నుంచి రుణం ఇస్తామని ఫోన్ చేసి రూ. 42,500 కాజేశారు. మీ సిబిల్ స్కోర్ బాగుందని రుణమిస్తామని ఫోన్ చేశారు. వారి మాటలు నమ్మి ఇన్సూరెన్స్ కోసం, డాక్యుమెంట్లు, ఆర్బీఐ అనుమతి కోసం అంటూ పలు దఫాలుగా డబ్బులు పంపారు. రుణం చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

News July 29, 2024

ఖమ్మం: ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘటన బాధాకరం

image

ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరద నీటిలో పడి ముగ్గురు నిరుద్యోగులు మృతి చెందడం బాధాకరమని, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కోరారు.

News July 29, 2024

నల్గొండ: జిల్లాలో స్థానిక ఎన్నికల జోష్

image

నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూCMరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC,ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.