Telangana

News July 25, 2024

26 నుండి ఇంటింటి జ్వర సర్వే: కలెక్టర్

image

ఈనెల 26 నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో “ఇంటింటి జ్వర సర్వే” నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. “ఇంటింటి జ్వర సర్వే” లో భాగంగా తక్షణమే మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.

News July 25, 2024

పార్లమెంట్ వద్ద నిరసన.. పాల్గొన్న ZHB ఎంపీ

image

బడ్జెట్‌లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొనగా.. వీరి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సైతం పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు.

News July 25, 2024

కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎంపీ వినతి

image

ఖమ్మం: కొత్త నేర చట్టాలను సవరించాలని కోరుతూ బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అమలు జరపాలని కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా పలు సమస్యలను కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు.

News July 25, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు RAIN ALERT

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారివర్షాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న జలపాతాలు జలసవ్వడి చేస్తున్నాయి. ప్రాజెక్టులు నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతున్నాయి.

News July 24, 2024

HYD: ఉమ్మడి జిల్లాలో నేటి.. TOP NEWS

image

✓బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండుసున్నా: KTR 
✓రైల్వే అభివృద్ధి కోసం కేంద్ర నిధులు కేటాయించింది: కిషన్ రెడ్డి 
✓కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది:CM 
✓గుండ్ల పోచంపల్లిలో కుక్కల దాడి.. ఆసుపత్రిలో చిన్నారి 
✓16 ఎంపీలు ఉన్న లాభం లేదు:MLA వివేకానంద 
✓అన్ని జిల్లాల్లో ఘనంగా KTR జన్మదిన వేడుకలు 
✓గచ్చిబౌలి:సుత్తితో తలపై కొట్టి ఓ యువకుడి హత్య

News July 24, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి CRIME REPORT

image

★ఆసిఫాబాద్: అడ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత 
★ కాగజ్ నగర్: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ 
★ ఆదిలాబాద్: కాంగ్రెస్ నాయకునిపై ఎస్పీకి జర్నలిస్టుల ఫిర్యాదు 
★ మంచిర్యాల : కిటికీలు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్ 
★ దహేగాం: భారీ వర్షానికి కూలిన ఇల్లు 
★ కుబీర్ : పేకాట ఆడుతున్న 6గురు అరెస్ట్ 
★ తాంసి: తోడేళ్ల దాడి.. ఐదు మేకలు మృతి 
★ భీంపూర్: పశువుల పాకలోకి దూసుకెళ్లిన RTC 

News July 24, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి “TOP NEWS”

image

✓జూరాలకు పెరిగిన వరద 41 గేట్లు ఎత్తివేత.
✓ జాతీయ స్థాయి వికసిత్ భారత్ పోటీల్లో పాలమూరు యునివర్సిటీ విద్యార్థిని సత్తా.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.
✓ కొల్లాపూర్:KLI మోటార్లను ప్రారంభించిన మంత్రి జూపల్లి.
✓ నేరాల నియంత్రణపై దృష్టి సాధించాలి నారాయణపేట ఎస్పీ.
✓బొంరాస్ పేటలో పర్యటించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసరు వర్షం.

News July 24, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్..

image

* WGL: బాలుడిపై వీధి కుక్కల దాడి..
* MLG: జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం..
* MLG: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి..
* MHBD: ఇద్దరి ప్రాణాలు తీసిన తప్పుడు మార్గం
* WGL: గుండె పోటుతో వ్యక్తి మృతి..
* WGL: గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ మృతి
* MLG: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన సదస్సు.

News July 24, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి టాప్ న్యూస్..

image

> WGL: పార్లమెంటు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కావ్య, బలరాంనాయక్ > MLG: తండాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం: సీతక్క > HNK: జిల్లా కేంద్రంలో ప్రభాస్ బుజ్జి కారు సందడి > JN: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు > MLG: బొగత జలపాతం సందర్శన బంద్ > BHPL: మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా: ఎస్పీ > MHBD: రైతు భరోసా నిధులు విడుదల చేయాలి: ఎమ్మెల్సీ

News July 24, 2024

KMR: భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష

image

భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఆపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టి.నాగరాణి బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని లింగంపేట్ మండలం పోతాయిపల్లికి చెందిన గారబోయిన చిన్న సంగయ్య (43) తన భార్యపై హత్యాయత్నం చేసినట్లు నిరూపణ కావడంతో ఈ తీర్పును వెలువరించారు.