India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసిఫాబాద్లో ఈనెల 29న నిర్వహించే మాజీ మంత్రి స్వర్గీయ కోట్నాక భీంరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ సభ్యులు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబును కోరారు. ఈ మేరకు ఇవాళ కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో గోండ్వాన జాతీయ నాయకులు సిడం అర్జు, మేడి మోతిరాం, సభ్యులు చిన్నయ్య, గుణ్వంతరావ్, తదితరులు ఉన్నారు.
సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి కట్టడిపై రాష్ట్రస్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఖమ్మం: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రెవెన్యూ, హౌజింగ్ అధికారులతో రెవెన్యూ, హౌజింగ్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి అట్టి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సూచించారు.
ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఉత్తమ టీచర్లకు ప్రతి ఏటా అవార్డులు అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నేషనల్ బెస్ట్ టీచర్గా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ ఎంపికయ్యారు. ఆయన దమ్మన్నపేట ZPHS పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. అవార్డులో భాగంగా రూ.50వేల నగదు బహుమతి, ప్రశంస పత్రం సిల్వర్ మెడల్ అందచేస్తారు.
> NSPT: విష జ్వరంతో యువకుడు మృతి
> MLG: గోదావరిలో అక్రమంగా దాచిన కలప స్వాధీనం
> MHBD: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
> MLG: గవర్నర్ పర్యటనలో అపశ్రుతి.. పాము కాటుతో కానిస్టేబుల్ అస్వస్థత
> WGL: ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
> JN: ఆంధ్రప్రదేశ్లో జనగామ వాసి అరెస్టు
> MHBD: బైకును ఢీ-కొట్టిన బస్సు
> BHPL: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
> WGL: WAY2NEWS ఎఫెక్ట్.. ఫ్లెక్సీ మార్పు
> MLG: రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సును సందర్శించిన గవర్నర్
> BHPL: ఈనెల 29న జాబ్ మేళా
> WGL: క్వింటా పత్తి ధర రూ.7,600
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద
> MLG: వాగు దాటాలంటే.. ట్రాక్టర్ టైరు ఆధారం!
> WGL: అండర్ బ్రిడ్జి వద్ద అగ్ని ప్రమాదం
> HNK: విష జ్వరాల నియంత్రణకు చర్యలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,42,100 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.76,350, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ 55,090, అన్నదానం రూ.10,660 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ముస్తాబాద్ పర్యటనలు రద్దైనట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హనుమకొండ జిల్లాలో ఉండటంతో గవర్నర్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించి 168 రోజులు జైల్లో వేయించడం బాధాకరం అని, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లిక్కర్ పాలసీతో కవితకు ఎలాంటి సంబంధం లేదని, వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ మంజూరై విడుదల కావడం పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.
చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆమె మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేస్ దర్యాప్తు చేయగా ఐదుగురు యువకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరిలో అర్బాజ్, షెహబాజ్, సోహెల్, వాజిద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.