India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీపీ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి , 15 ఎస్ఎస్టి , 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు చెప్పారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అటు ప్రజలతో మర్యాదగా మెలగాలని పేర్కొన్నారు.
మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.
మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్ ఓపెనింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల వివరాలను తెలియజేస్తామన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు (బుధవారం) బంద్ ఉండనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్కి ప్రతీ బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవల అధికారులు పేర్కోన్నారు. ఈ క్రమంలోనే రేపు మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎల్లుండి గురువారం మార్కెట్ యథాతథంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారులు, పోలీస్ అధికారులతో అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల రోడ్లను తనిఖీ చేయాలని, మాక్పోల్, రిజర్వు ఈవీఎం నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలను గ్రీవెన్స్ కమిటీకి చూపి తీసుకువెళ్ళొచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలను వెంట పెట్టుకోవాలని చెప్పారు. 10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఐటి శాఖకు సమాచారం అందిస్తామన్నారు.
✓రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఫొటోగ్రఫీ పై నైపుణ్య శిక్షణ
✓ఉప్పల్:రియల్ ఎస్టేట్ పేరుతో మోసం.. బాధితుల ఆందోళన
✓మ్యాన్హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్
✓ఓయూ పీఎస్ పరిధిలో పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి
✓నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా ARREST ✓చందానగర్లో కారులో మంటలు
✓జీడిమెట్లలో 9వ అంతస్తు నుంచి పడి ఒకరి మృతి
✓కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచి, అభివృద్ధి చేస్తా: రంజిత్ రెడ్డి
HYDలో గృహ జ్యోతి పథకానికి అర్హులైనప్పటికీ జీరో బిల్ రాని వారి సమస్యలను పరిష్కరించడం కోసం GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా, ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రజా పాలన సేవా కేంద్రాలు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, మల్కాజిగిరి డీసీ రాజు తెలిపారు.
HYDలో గృహ జ్యోతి పథకానికి అర్హులైనప్పటికీ జీరో బిల్ రాని వారి సమస్యలను పరిష్కరించడం కోసం GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా, ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రజా పాలన సేవా కేంద్రాలు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, మల్కాజిగిరి డీసీ రాజు తెలిపారు.
Sorry, no posts matched your criteria.