Telangana

News August 27, 2024

గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సన్నాహక సమావేశం

image

హైదరాబాద్ MCHRHRDలో గణేష్ ఉత్సవాలు – 2024 ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు నాయకులతో కలిసి మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. హైదారాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, MLA దానం నాగేందర్, డీజీపీ, Spl.CS, హైదరాబాద్ సీపీ, కలెక్టర్, హైద్రాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధిత MLA, MLC ఖైరతాబాద్ గణేశ్ ఇతర గణేష్ ఉత్సవ కమీటీ విశ్వహిందు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

News August 27, 2024

HYD: తెలుగు వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు

image

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూజీ, డిప్లమా కోర్సులలో ప్రవేశాల గడువు ఈనెల 31వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్టర్ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన వారందరూ ఈ నెల 31వ తేదీలోగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News August 27, 2024

ADB: ముగ్గురి మృతదేహాలు వెలికితీత

image

ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన అక్షయ్, ఆకాశ్, విజయ్ తాంసీ మండలంలోని బండల్ నాగపూర్‌లోని తమ బంధువు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే సరదాగా మంగళవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కాగా, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు యువకుల మృతదేహాలు వెలికితీశారు.

News August 27, 2024

ధర్మపురి: గోదావరి నదికి పెరిగిన వరద

image

ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి వరద పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలు, వాగుల ద్వారా ప్రవహిస్తున్న నీరు నదిలో చేరుతోంది. ధర్మపురి వద్ద ఉసిరిక వాగు దాటి నీటి ప్రవాహం కొనసాగుతోంది. వాగు దాటి అటువైపు భక్తులు స్నానాలు చేసేందుకు వెళ్లకుండా వరద ప్రవాహం పెరిగింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

News August 27, 2024

HYD: పోలీసు సిబ్బందికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధురానగర్ పీఎస్‌లలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సీపీ స్పందించారు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.

News August 27, 2024

HYD: పోలీసు సిబ్బందికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధురానగర్ పీఎస్‌లలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సీపీ స్పందించారు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.

News August 27, 2024

మహిళల రక్షణ కోసం 112 యాప్: DSP

image

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా 112 ఆప్ తీసుకొచ్చింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో 112కు ఫిర్యాదు చేస్తే సమీపంలోని ఠాణాకు సమాచారం వెళ్తుందని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అప్రమత్తమై లొకేషన్‌ ద్వారా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాపాడుతారని.. ప్రతి ఒక్కరు ఈ యాప్‌పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 27, 2024

మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి

image

మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆపై నిప్పంటించుకున్న ఘటన మంగళవారం కొత్తగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన ఇమ్మానుయేల్(54) ఆటో డ్రైవర్ గా వృత్తి నిర్వహిస్తున్నాడు. కాగా మద్యం మత్తులో ఉన్న ఇమ్మానుయేల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో 90% శరీరం కాలిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News August 27, 2024

జూరాలకు గంట గంటకు పెరుగుతున్న వరద

image

 జూరాలకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతూనే ఉంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపురం డ్యాం నుంచి దిగువ ఉన్న జూరాల ప్రాజెక్టుకు 1 లక్ష 70 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో జూరాల 37 గేట్లను ఎత్తివేసి 1 లక్ష 84 వేల క్యూసెక్కుల పడితే నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతుంది. నదితీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

News August 27, 2024

ఆదిలాబాద్: చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు

image

చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కూలీలు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లగా వాగులో గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.