India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవి వేళ భూరగ్భజలాలు అడుగంటి ఆదిలాబాద్లో నీటి ఎద్దడి మొదలైంది. జిల్లాలో మొత్తం 972 కొత్త తాగు నీటి పథకాలు, పాత పథకాలు 557, చేతిపంపులు 3,461, మోటార్లు 220 ఉన్నాయి. అయినా ఇంద్రవెల్లి, నార్నూర్ తదితర ఏజెన్సీ మండలాల్లో చేతిపంపు నుంచి నీళ్లు రావడం గగనంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఈ సమయంలో మిషన్ భగీరథ SE సురేశ్ శుభవార్త చెప్పారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామానికి నీరు అందిస్తామన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైందా… అంటే అవుననే అంటున్నారు అక్కడి జనం. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.
కారేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.రామగోపిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ జయరాజు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విధులకు హాజరుకాకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలలో విద్యావలంటీర్ను ఏర్పాటుచేసినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండలంలోని బండ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన పండరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోయినట్లు తెలిపారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు కుటుంబ సభ్యులు తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడన్నారు.
ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టి అక్రంగా అరెస్ట్ చేసారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఢీల్లీలో ఎంపీలు నామా, కే.ఆర్ సురేష్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవితా బాధితురాలని, నిందితురాలు కాదని వారు పేర్కొన్నారు. ఇన్ని రోజులు సాగదీసి, లోక్ సభ ఎన్నికలకు ముందు కేసును తెరపైకి తేవడం రాజకీయ కోణమన్నారు . తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్నారు
ఈనెల 28న జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. నారాయణపేట ఎంపిడివో కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లాలో మొత్తం 205 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల ప్రణాళిక, తీసుకోవలసిన జాగ్రత్తలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా పరిశోధన సంచాలకులు డా. పి. రఘు రామిరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, NLG జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్యర్యంలో నల్గొండ కలెక్టరేట్లో శుక్రవారం దక్షిణ తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్య నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమైన పత్రికలు, పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్తో కలిసి సందర్శించి సౌకర్యాలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
♥NGKL:BRS ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
♥సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు
♥మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం:సంపత్
♥ఎన్నికల కోడ్ ముగిశాకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి అమలు
♥WNPT:మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల రాజీనామాలకు ఆమోదం
♥నాకు ఎలాంటి నోటీసులు రాలేదు:MLA విజయుడు
♥ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
♥ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
నల్గొండ జిల్లాలో నేటి నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.