India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లారీని ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. GDK నుంచి మంథని రహదారిలో మూసి వేసిన త్రీ ఇంక్లైన్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొగ్గు లారీని ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాకతీయ నగర్కి చెందిన మంద కిరణ్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంథని ఎగ్లాస్పూర్కి చెందిన రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మల్లు రవిని అధిష్ఠానం ప్రకటించింది. ఈ సీటు కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం పట్టుబడ్డారు. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. వారి అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం టికెట్ను మల్లు రవికి కేటాయించింది. దీంతో కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది.
రజాకార్ సినిమా బృందానికి గురువారం బయ్యారం మండలం కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినిమా నటి అనసూయ అమరవీరుల స్తూపానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మండల కళాకారులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
కుక్కునూరు, కూనవరం, విఆర్ పురం, ఐ పోలవరం, చింతూరు, ఎటుపా, రాజవొమ్మంగి మండలాల్లో ఇప్పటి వరకు గిరిజనులు 50 సింగిల్ బార్ తుపాకులను వివిధ పోలీస్టేషన్లలో అందజేశారని ఎఎస్పీ జగదీష్ అన్నారు. రాజవొమ్మంగి పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారభించారు. ఆయుధాల నియంత్రణ చట్టం ప్రకారం నిషేధిత తుపాకులు కలిగి ఉండడం నేరమని, ఇకపై తుపాకీతో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
*ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి
*చైనాలో గుండెపోటుతో పాలమూరు వాసి మృతి
*MBNR:కారు,బైక్ ఢీ.. కాంగ్రెస్ నేత మృతి
*జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
*NGKL:కన్న కొడుకును హత్య చేసిన తల్లి
*దేశం కోసం మోదీ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి: డీకే అరుణ
*MPగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి
*ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు
*NRPT:పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
2024 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ పిఎస్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరిపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం హన్మకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామంలో దుబ్బగళ్ళ సంగమ్మ(44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొద్ది నెల క్రితం భర్త మృతిచెందగా.. కొడుకు హైదరాబాదులో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి ఇంట్లో పడుకున్న సంగమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్కు అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. ఇటీవల BRS నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఆయన అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం మాత్రం టికెట్ను దానం నాగేందర్కు కేటాయించింది.
కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్కు అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. ఇటీవల BRS నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఆయన అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం మాత్రం టికెట్ను దానం నాగేందర్కు కేటాయించింది.
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర కలదు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ సాగుతోంది. BRSతరఫున నామా, BJPతరఫున జలగం బరిలో ఉండగా కాంగ్రెస్లో నందిని,యుగేందర్,ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి ఖరారు కాగా అలకలు లేకుండా చేసి ప్రకటన చేయాలనీ అధిష్టానం భావిస్తుంది.
Sorry, no posts matched your criteria.