Telangana

News March 21, 2024

HYD: ‘అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్నారు’

image

ఇంటర్‌నెట్ సాయంతో అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్న హిదాయత్‌అలీ(40), అహ్మద్‌(40)ను అరెస్ట్ చేశామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వీరి వద్ద 3 యాక్ట్‌ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, సిమ్‌ కార్డ్‌ బాక్స్‌లు(32 స్లాట్‌లు), 3 రూటర్‌లు, 6 లాప్‌ట్యాప్‌లు, 2 హార్ట్‌ డిస్క్‌లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ శ్రీనివాసరావు, డీసీపీ ఎస్‌.రేష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు.

News March 21, 2024

HYD: ‘అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్నారు’

image

ఇంటర్‌నెట్ సాయంతో అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్న హిదాయత్‌అలీ(40), అహ్మద్‌(40)ను అరెస్ట్ చేశామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వీరి వద్ద 3 యాక్ట్‌ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, సిమ్‌ కార్డ్‌ బాక్స్‌లు(32 స్లాట్‌లు), 3 రూటర్‌లు, 6 లాప్‌ట్యాప్‌లు, 2 హార్ట్‌ డిస్క్‌లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ శ్రీనివాసరావు, డీసీపీ ఎస్‌.రేష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు.

News March 21, 2024

కొడంగల్: జానపద కళాకారుడికి సూర్య పర్వ్ అవార్డు

image

కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ప్రకాశ్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ కల్చర్ టీం లీడర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అయోధ్యలో శ్రీ సీతారామ సన్నిధిలో సూర్య పర్వ్ అవార్డుతో సత్కరించారు. సూర్య పర్వ్ కార్యక్రమంలో దేశంలోని 18 రాష్ట్రాల కళాకారులు ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రకాశ్ తెలిపారు.

News March 21, 2024

నన్ను ఎంపీగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి

image

పాలమూరు బిడ్డగా రాష్ట్రంలోనే తొలి జాబితాలో ఎంపీ టికెట్ దక్కే అవకాశం లభించిందని, తనను గెలిపించే బాధ్యత కూడా ఇదే పాలమూరు బిడ్డలు తీసుకోవాలని CWC ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీ చంద్ రెడ్డి కోరారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. గత పది ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప అధికారులు ప్రజాప్రతినిధులకు ఎవరికీ అధికారం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆరోపించారు.

News March 21, 2024

మాజీ సీఎంకి స్వాగతం పలికిన మంత్రి పొన్నం

image

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితోపాటు సహచర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

News March 21, 2024

ఖమ్మం: కీలక నేత పార్టీ మార్పు..?

image

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ మారుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎంపీ నామాను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు దిల్లీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామా పోటీ చేస్తారని టాక్. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అటు నామా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

News March 21, 2024

HYD: BRS మాజీ నేతలకే.. ఆ పార్టీల్లో టికెట్?

image

HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?

News March 21, 2024

HYD: BRS మాజీ నేతలకే.. ఆ పార్టీల్లో టికెట్?

image

HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?

News March 21, 2024

NGKL: కన్న కొడుకును హత్య చేసిన తల్లి

image

ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె బరిలో ఉన్నారు.

error: Content is protected !!