Telangana

News July 3, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌‌తో పరారీ.. మందుబాబు అరెస్ట్

image

డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీల్లో సహకరించకుండా బ్రీత్ అనలైజర్‌ లాక్కొని పరారీ అయిన వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో జూన్ 27న తనిఖీలు నిర్వహించారు. కారులో వస్తున్న శ్రవణ్ కుమార్‌‌ను ఆపి టెస్ట్ చేయబోయారు. ఒక్కసారిగా బ్రీత్ అనలైజర్‌ను లాక్కున్న అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

News July 3, 2024

కొత్తగూడెం: చెట్టు కింద చదువు.. 54 మందికి ఒక్కరే టీచర్

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటుతున్నా ఇంకా చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి వెంకటాపురం మండలంలో బోధపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. 54 మంది పైగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఒక్కరే టీచర్ ఉన్నారని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని.. నూతన భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News July 3, 2024

ఆందోల్: విద్యుదాఘాతంతో లైన్ మెన్ మృతి

image

విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారంలో జరిగింది. స్థానికుల వివరాలు.. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన లైన్ మెన్ చంద్రశేఖర్, మరో లైన్ మెన్ విద్యుత్ లైన్‌‌ను బాగు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగగా చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

News July 3, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలన్నారు.

News July 3, 2024

ఉచితంగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ

image

అర్హులైన రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల ఉచితంగా కోడెల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రాన్ని ఏర్పాటు చేశారు.

News July 3, 2024

బాసర IIIT అర్హుల జాబితా విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసర IIIT క్యాంపస్ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదలైంది. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 1,500 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జులై 8, 9, 10 తేదీల్లో పరిశీలిస్తారు. స్పెషల్ కేటగిరీ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇప్పటికే విడుదలైంది. వారికి జులై 4, 5 తేదీల్లో బాసర క్యాంపస్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

News July 3, 2024

హైదరాబాద్‌లో ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణగూడ‌లో శానిటేషన్ పనులపై ఆరా తీశారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ZCని ఆదేశించారు. శంకర్‌మఠ్ వద్ద రాంకీ RFC వెహికిల్ డ్రైవ‌ర్‌తోనూ ఆమె మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్థినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.

News July 3, 2024

కరీంనగర్ చరిత్రలో ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదు: గంగుల

image

శాసనసభ్యులుగా ఎన్నికై ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తావించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తితే క్రిమినల్ కేసులు పెట్టడం కరీంనగర్ జిల్లా చరిత్రలో లేదని పేర్కొన్నారు. సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తే విధులకు ఆటంకం కలిగించినట్లు ఎలా అవుతుందని గంగుల ప్రశ్నించారు.

News July 3, 2024

హైదరాబాద్‌లో ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణగూడ‌లో శానిటేషన్ పనులపై ఆరా తీశారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ZCని ఆదేశించారు. శంకర్‌మఠ్ వద్ద రాంకీ RFC వెహికిల్ డ్రైవ‌ర్‌తోనూ ఆమె మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్థినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.

News July 3, 2024

జిల్లా వ్యాప్తంగా 66 లక్షల మొక్కలు నాటాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.