India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుణాల పేరుతో రూ.2.82 కోట్లు దోచుకున్న తాళ్లసింగారానికి చెందిన ఎస్బీఐ మేనేజర్ హరిప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు నూతనకల్ ఎస్సై సైదులు తెలిపారు. ప్రస్తుత మేనేజర్ రవీందర్ ఫిర్యాదు మేరకు.. నకిలీ రైతులు, వ్యాపారస్థులు, మహిళా సంఘాల పేరుతో రుణాలు మంజూరు చేసి తన ఖాతాలోకి నిధులు మళ్లించుకొని రూ.కోట్ల బ్యాంకు సొమ్ము కాజేసినట్లు రుజువు కావడంతో హరిప్రసాద్తో పాటు అతనికి సహకరించిన 14 మందిపై కేసు నమోదు చేశారు.
పదో తరగతి విద్యార్థినిపై అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సుజాతనగర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసు వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, బాలుడు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలికపై ఆ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్లో 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్: 12
*పటాన్చెరు-CBS రూట్: 6
*పటాన్చెరు-కోఠి రూట్: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT
హుస్నాబాద్కి చెందిన రుద్రయ్య(20) కరీంనగర్ జిల్లాలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో ఓ యువతిని గత నెల 2న పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రుద్రయ్య ఇంటికి వెళ్లి మేజర్ అయ్యే వరకు దూరంగా ఉండాలంటూ యువతిని తీసుకువెళ్లారు. అనంతరం ఫొటోలను డిలీట్ చేయాలంటూ బెదిరించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లో 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్: 12
*పటాన్చెరు-CBS రూట్: 6
*పటాన్చెరు-కోఠి రూట్: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT
రెండు రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బాల్కసుమన్తో విభేదాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి BRS టికెట్టు రాకపోవటంతో ఆయన BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు రాలేదని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడటం చెన్నూర్కి తీరని లోటని స్థానికులు భావిస్తున్నారు.
బైకు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై సురేందర్ కథనం ప్రకారం.. గోపాల్రావుపేటకు చెందిన అరవింద్తో కలిసి రాకేశ్(21) మంగళవారం రాత్రి తన బావ బర్త్డే వేడుకలు జరుపుకొన్నారు. అక్కడి నుంచి చొప్పదండిలో భోజనం చేసేందుకు ఇద్దరు బైకుపై లక్ష్మీపూర్ మీదుగా బయలుదేరారు. వెంకట్రావుపల్లి శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. క్షతగాత్రులను KNR ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే రాకేశ్ మృతి చెందాడు.
బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే బత్తాయి సుమారు 60 వేల ఎకరాల్లో, నిమ్మ 20 వేల ఎకరాల్లో ఉన్నాయి. రూ. లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
Sorry, no posts matched your criteria.