Telangana

News July 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాత వివరాలు

image

ఉమ్మడి WGL జిల్లాలో వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. BHPLలో సాధారణ వర్షపాతం 311.7mm ఉండగా.. 307.7mm నమోదైంది. HNKలో సాధారణ వర్షపాతం 273.9mm ఉండగా.. 305.5mm రికార్డైంది. జనగామలో 232.4mm ఉండగా.. 258mm నమోదైంది. WGLలో 285.3mm సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 299mm నమోదైంది. ములుగులో 360.5mm వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. 397.5mm కురిసింది. MHBDలో సాధారణ వర్షపాతం 257mm ఉండగా.. 289.6mm నమోదైంది.

News July 17, 2024

MBNR: శ్రీధర్ రెడ్డి హత్య.. దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు

image

చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో 2 నెలల క్రితం జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీని సీఎం రేవంత్ కోరారు. నిన్న HYDలో కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో పోలీసులకు సూచించారు. శ్రీధర్ రెడ్డి కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని జిల్లా అధికారులను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

News July 17, 2024

ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదయింది. పోలీసుల వివరాలు..ఖానాపురానికి చెందిన 9వతరగతి బాలిక ఖమ్మంకు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఇంటికి వెళ్లిన తరువాత గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాను తెలిపారు.

News July 17, 2024

పుల్కల్: డెడ్‌స్టోరేజీ దిశగా నల్లవాగు ప్రాజెక్టు

image

సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోతుండటం రైతులను కలవరపెడుతుంది. నల్లవాగు ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరింది. సింగూరు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 13.565 TMCలుగా ఉన్నాయి.

News July 17, 2024

దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య

image

గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI రాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తునికినూతల గ్రామానికి చెందిన వడ్త్యా శ్రీని, పద్మజల దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. నగరానికి కొన్నేళ్లక్రితం వచ్చి నాదర్‌గుల్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం శ్రీని, పద్మజ మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. దీంతో పద్మజ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News July 17, 2024

ఓడీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ రఘునందన్

image

ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడి ఇన్ఫెక్షన్ బంగ్లాలో సీజీఎం శివశంకర ప్రసాద్, జీఎం లతోపాటు ఇతర ప్రతినిధులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్ సమస్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరిస్తానని రఘునందన్ అన్నారు.

News July 17, 2024

MBNR: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రతి సంవత్సరం ఇచ్చే జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో రవీందర్ మంగళవారం పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు ఈనెల 18వ తేదీ వరకు గడువును పొడిగించారని చెప్పారు. http:///nationalaward stoteachers.education.gov.in అనే పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 17, 2024

HYD: బర్త్ డే వేడుకలకు వెళ్లి వస్తూ.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHB పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. రణధీశ్ (20) KPHB పరిధిలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మియాపూర్‌లోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో JNTU మెట్రో స్టేషన్ వద్ద పాల వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 17, 2024

HYD: బర్త్ డే వేడుకలకు వెళ్లి వస్తూ.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHB పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. రణధీశ్ (20) KPHB పరిధిలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మియాపూర్‌లోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో JNTU మెట్రో స్టేషన్ వద్ద పాల వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 17, 2024

సంగారెడ్డి: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని దాడి.. తండ్రి మృతి

image

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చౌకన్పల్లికి చెందిన మారుతిని తన కొడుకు నరసప్ప డబ్బులు అవసరమని మంగళవారం అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై నరసప్ప ఆవేశంతో గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. మారుతికి చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.