India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి మండలం దత్తాయపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్, పెద్ద తండా మాజీ సర్పంచ్ కుమారుడు రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్లో చేరామని దేవేందర్, రాజు నాయక్ అన్నారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో గరిడేపల్లి మండలం వెలిదండకు చెందిన అన్నదమ్ములు సత్తాచాటారు. తుమ్మకొమ శ్యామ్ సుందర్ , రాము, దశరథ్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. శ్యామ్ సుందర్ మిర్యాలగూడ గురుకుల స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాము కోదాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. దశరథ్ బాసరలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేసుకొని గ్రూపు-1కి ప్రిపేర్ అయ్యారు.

బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలు.. HYD బహదూర్పుర వాసి మహేశ్(25) డీసీఎం డ్రైవర్. ఇతడు కీసర మండలం రాంపల్లిదాయరలోని ఓ పరిశ్రమ నుంచి పైపులు తీసుకెళ్లేందుకు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో సమీపంలో ఉండే బాలిక(14)పై అతడి కన్నుపడింది. రాత్రి వచ్చిన మహేశ్కు బాత్ రూమ్ వెళ్లిన బాలిక కనిపించగా తీసుకెళ్లి వ్యానులో అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలు.. HYD బహదూర్పుర వాసి మహేశ్(25) డీసీఎం డ్రైవర్. ఇతడు కీసర మండలం రాంపల్లిదాయరలోని ఓ పరిశ్రమ నుంచి పైపులు తీసుకెళ్లేందుకు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో సమీపంలో ఉండే బాలిక(14)పై అతడి కన్నుపడింది. రాత్రి వచ్చిన మహేశ్కు బాత్ రూమ్ వెళ్లిన బాలిక కనిపించగా తీసుకెళ్లి వ్యానులో అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

నిద్రమాత్రలు మింగి జిల్లా టీఎన్జీవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అబ్దుల్ హాసన్ తన ఇంట్లో భారీ మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్టైన ఆయన బెయిల్పై విడుదలయ్యారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల నాటి(పూర్వ) విద్యార్థులే నేడు టీచర్లు అయ్యారు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలి పదోన్నతులు, బదిలీల్లో వీరంతా జోగిపేటకు వచ్చారు. చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే ఇప్పుడు పాఠాలు నేర్పే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదని టీచర్లు మాణయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్(PD), రమేశ్ కుమార్ అన్నారు.

చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కిన ఘటన పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగింది.యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాలు.. జడ్చర్ల మండలం పెద్దఆదిరాలకు చెందిన బరిగల శివకుమార్(23), మల్కాజిగిరిలో ఉంటున్న పవన్(24)లు పాత నేరస్థులు. చౌటుప్పల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. విచారించగా చోరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికల్పేట్లోని మురళిగూడ వద్ద గుట్ట ఎక్కుతున్న క్రమంలో బొలెరో బోల్తా పడింది. అందులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెజ్జూర్ నుంచి సిమెంట్, రేకులు, సిలెండర్లతో పాలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు, తల్లిదండ్రులతో వాహనం గ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో గుట్ట ఎక్కుతుండగా బొలేరో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 96 టీచర్ల పోస్టులు, 381 ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి తెలిపారు.

మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామ శివారులోని కమ్మరివారి కుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువు సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు ఎలా చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది. మృతుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోలీసులు సూచించారు.
Sorry, no posts matched your criteria.