Telangana

News July 9, 2024

HYD: 30.81 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

image

GHMC పరిధిలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 30.81 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వరకు హరితహారం పేరిట జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని పేరును వనమహోత్సవంగా మార్చింది. అయితే బెల్టోపారం, గుల్మోహార్ వంటి వాటితో పాటు ఈసారి కానుగ, వేప, రావి వంటివి సైతం నాటనున్నారు.

News July 9, 2024

HYD: 30.81 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

image

GHMC పరిధిలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 30.81 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వరకు హరితహారం పేరిట జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని పేరును వనమహోత్సవంగా మార్చింది. అయితే బెల్టోపారం, గుల్మోహార్ వంటి వాటితో పాటు ఈసారి కానుగ, వేప, రావి వంటివి సైతం నాటనున్నారు.

News July 9, 2024

ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా ప్రయాణం: RM KMM

image

ఖమ్మం రీజియన్లో ప్రతిరోజు 517 బస్సులు నడుపుతున్నామని RM సరి రామ్ తెలిపారు. ఆయా బస్సులలో రెండు లక్షల నుంచి 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. నెలవారి సీజన్ టికెట్ రిటర్న్, జర్నీ రాయితీ టికెట్, సూపర్ లగ్జరీ చార్జితో లహరి NON AC బస్సు లలో ప్రయాణం వంటి సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న కూరగాయల సాగు

image

ఉమ్మడి జిల్లాలో ఏటా కూరగాయల సాగు తగ్గుతూ వస్తోంది. దీంతో కూరగాయలను వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో దిగుమతి తగ్గి డిమాండ్‌ పెరిగి ధరలు మండుతున్నాయి. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లాలో అరకొరగా సాగయ్యే కూరగాయలు సైతం మార్కెట్‌కు రావడం లేదు.

News July 9, 2024

యజమాని, కౌలుదారు ముందే మాట్లాడుకోవాలి: మంత్రి తుమ్మల

image

రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆగస్టు 15వ తేదీలోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నామన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలని, కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలన్నారు. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది సీఏం నిర్ణయమని స్పష్టం చేశారు.

News July 9, 2024

వైయస్సార్‌పై భట్టి కామెంట్స్

image

పాలకుడు ఎలా ఉండాలో వైయస్సార్ చూపించారని, ఆయన హయాంలో MLCగా పని చేయటం మర్చిపోలేనని డిప్యూటి సీఎం  భట్టి విక్రమార్క అన్నారు. వైయస్సార్ చివరి వరకు ప్రజల కోసమే పని చేశారని, సీఎంగా వైయస్సార్ తనదైన ముద్ర వేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108వంటి సేవలు దేశానికే ఆదర్శమని, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు.

News July 9, 2024

వాంకిడి: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

వాంకిడి మండల కేంద్రానికి చెందిన గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుడు మడావి రాజేశ్వర్(58) గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారు జామున అస్వస్థతకు గురికావడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వర్ తిర్యాణి మండలం గుండాల గిరిజన పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News July 9, 2024

NZB: బాయ్స్ హాస్టల్‌లో యువతి.. విద్యార్థి సస్పెండ్

image

బాయ్స్ హస్టల్‌లో యువతికి ఓ స్టూడెంట్ 15రోజుల క్రితం ఆశ్రయమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల వివరాలిలా.. టీయూలో విద్యార్థి పీజీ చదువుతూ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఓ యువతికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని తోటి విద్యార్థులు వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ స్టూడెంట్‌ని  సస్పెండ్ చేశారు.

News July 9, 2024

జిల్లాకు సీఎం.. 937 మంది పోలీసులతో బందోబస్తు

image

CM రేవంత్‌రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. SP డి.జానకి నేతృత్వంలో కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 937 మందితో పకడ్బందీగా భద్రతను చేపడుతున్నారు. SP, ఇద్దరు అదనపు SPలు, 8 మంది DSPలు, 35 మంది CIలు, 64 మంది SIలు, 98 మంది ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, 410 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొననున్నారు.

News July 9, 2024

MBNR: సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి నజర్!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సొంత జిల్లా కావడంతో ఇక్కడి అభివృద్ధిపై ఆయన నజర్ పెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికారులతో ఈరోజు చర్చిస్తారు.