India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. బుధవారం రాజ్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం విషాదకర ఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు కిష్టయ్య, వెంకటేశ్గా గుర్తించారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 2వ విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్ రాగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. బీజేపీ గోడం నగేశ్కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్లో చేరారు.
మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడి జిల్లాలో గడచిన ఐదేళ్లలో 2,28,905 మంది ఓటర్లు పెరిగారు. కరీంనగర్ పరిధిలో 1,37,499 ఓటర్లు, పెద్దపల్లి పార్లమెంటు రామగుండం, మంథని, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీలలో 57,287, నిజామాబాద్ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో 34,119 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 2,28,905 మంది ఓటర్లు పెరిగారు.
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో 327 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సింగరేణి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలన్నారు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడబ్ల్యూడీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుందని సింగరేణి అధికారులు తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :04-05-2024 కాగా https://seclmines.com/scclnew/index.asp వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం నీటిలో కొట్టుకెళ్తుండగా స్థానిక గొర్రెల కాపర్లు చూసి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేసవికాలం వేళ HYDలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో 5న సరాసరిగా 52.15 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఒక రోజుకు 70.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
వేసవికాలం వేళ HYDలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో 5న సరాసరిగా 52.15 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఒక రోజుకు 70.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
బాల్కొండ మండల పరిధిలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నాగపూర్కు వెళ్తున్న రోహిత్ కుమార్ బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.
నారాయణపేట జిల్లాకు చెందిన రవి కుమార్ 4/400 మీటర్ల రిలే పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు. చండీగఢ్లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని అసమాన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన రవిని అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, మిత్రులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.