Telangana

News March 26, 2024

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు మహమ్మద్ నగర్ మండలం అసన్ పల్లికి చెందిన కురుమ ప్రశాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు..

image

MLC ఉప ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,439 మంది MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లు, MLAలు, MLCలు, MPలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. 850 మందికి పైగా ఓటర్లు BRSకు సంబంధించిన వారు ఉండగా, 350 మంది కాంగ్రెస్ పార్టీ, 50 మంది BJP, మిగతా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగడంతో BRS ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

News March 26, 2024

HYD సిటీ బస్సుల సమాచారం.. మీ చేతిలో!

image

HYDలోని సిటీ ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడం చాలా సులభమని అధికారులు తెలిపారు. కోఠి, రేతి ఫైల్ బస్ స్టేషన్లలో కమ్యూనికేషన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సెంటర్లకు కాల్ చేస్తే సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. 9959226160, 9959226154 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఇటీవల సిటీలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.

News March 26, 2024

HYD సిటీ బస్సుల సమాచారం.. మీ చేతిలో!

image

HYDలోని సిటీ ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడం చాలా సులభమని అధికారులు తెలిపారు. కోఠి, రేతి ఫైల్ బస్ స్టేషన్లలో కమ్యూనికేషన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సెంటర్లకు కాల్ చేస్తే సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. 9959226160, 9959226154 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఇటీవల సిటీలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.

News March 26, 2024

HYDలో మండుతున్న ఎండలు..!

image

HYDలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. సోమవారం సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.3గా నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌లో 39.6, షేక్‌పేట్‌లో 39.2, అసిఫ్‌నగర్‌లో 38.8, సరూర్‌నగర్‌లో 38.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.

News March 26, 2024

HYDలో మండుతున్న ఎండలు..!

image

HYDలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. సోమవారం సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.3గా నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌లో 39.6, షేక్‌పేట్‌లో 39.2, అసిఫ్‌నగర్‌లో 38.8, సరూర్‌నగర్‌లో 38.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.

News March 26, 2024

ఖమ్మం మార్కెట్‌లో భారీగా తగ్గిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర భారీగా తగ్గింది. క్వింటా మిర్చి ధర రూ.19,800 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.400 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News March 26, 2024

వరంగల్: యువతి ఫోన్ నుంచి మెసేజ్.. యువకుడిపై దాడి

image

నర్సంపేటకు చెందిన ఓ యువతి, తొర్రూరు మండలం చర్లపాలెం వాసి ప్రకాశ్‌ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఒప్పుకోని యువతి తండ్రి శ్రీనివాస్‌.. 5నెలల క్రితం పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించగా ఆ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కుమార్తెపై అనుమానంతో ఈనెల 24న ఆమె ఫోన్ నుంచి ఇంటికి రావాలని ప్రకాశ్‌‌కు శ్రీనివాస్ మెసేజ్ చేశాడు. అది నమ్మి ఇంటికి వచ్చిన ప్రకాశ్‌పై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

News March 26, 2024

HYD: మోదీ గ్రేట్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉందని, అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమైందని బీజేపీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలి హిల్ రిడ్జ్ కాలనీలో ఆయన మాట్లాడారు. అసాధ్యం అనుకున్న అనేక కార్యక్రమాలను సుసాధ్యం చేశారని, అందుకే నరేంద్ర మోదీ గ్రేట్ అని కొనియాడారు. దేశాభివృద్ధి ఇదే వేగంతో కొనసాగాలంటే ప్రజలు బీజేపీకే ఓటు వేయాలన్నారు.

News March 26, 2024

HYD: ఒంటరిగా వెళ్లేవారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను HYD పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా HYDలో ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.