India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి జరగనున్నాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి , ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. గత పదేళ్లుగా ఎంపీటీసీలు మొదలు జిల్లా స్థాయి చైర్మన్ల వరకు అన్ని భారాస ఖాతాలోనే ఉండటంతో.. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మూడింట రెండొంతుల పురపాలికల్లో హస్తం పార్టీ పాగా వేసింది. మిగిలిన వాటినీ లోక్ సభ ఎన్నికల్లోపే హస్తగతం చేసుకునేలా కసరత్తు చేస్తోంది
కామారెడ్డి మండలం రామేశ్వర్ పల్లి, ఆరేపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అతడు సోమవారం రాత్రి హత్యకు గురైనట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.
HYD వనస్థలిపురం PS పరిధిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(26) వనస్థలిపురంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
HYD వనస్థలిపురం PS పరిధిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(26) వనస్థలిపురంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 27, 28న ఉత్తర తెలంగాణ జోన్ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్, డిఏఓ బి. వాణి తెలిపారు. గత సీజన్లలో పంటల సాగులో తలెత్తిన సమస్యలను చర్చించి, వచ్చే సీజన్లకు చేపట్టాల్సిన పరిశోధన కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.
పరకాల మండలం వెంకటాపూర్కు చెందిన వెంకటేష్,ఆశ్విత కొడుకు మహాన్(1) తలకు కణితి అయింది. కాగా బాలుడి వైద్యానికి ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులుకు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా అమెరికాలో ఉంటున్న NRI మేటమర్రి కామేశ్- ప్రతిమ దంపతులు స్పందించి బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం అందించి పెద్ద మనస్సు చాటుకున్నారు. బాలుడి నిన్న డిశ్చార్జి కాగా దాతలకు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు.
BRS కంచుకోట, హరీశ్రావు ఇలాకా సిద్దిపేటలో రాజకీయాలు అంతుపట్టడం లేదు. BRSకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్లో చేరదామనుకునేవారు గోవా టూర్ వెళ్లి అక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్, భర్తపై అసంతృప్తిగా ఉండి అవిశ్వాస తీర్మానానికి BRS కౌన్సిలర్లు మొగ్గుచూపుతున్నారని, గోవా నుంచి రాగానే పార్టీ మారుతారని చర్చ సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో చిన్నారులు బలహీనమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సరైన పోషకాలు అందక బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4, 203 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. 1, 81, 214 మంది ఆరేళ్ల లోపు చిన్నారులున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. టీ. శ్రీలక్ష్మి, టీఎస్సీ కోఆర్డినేటర్ డా. సీహెచ్. శోభారాణి తెలిపారు. ఇందులో భాగంగా 2021 నుంచి 2024 వరకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.