India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎండలు ముదురుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత వర్షా కాలంలో సెప్టెంబర్ తర్వాత తగినంతగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో గ్రౌండ్ వాటర్ లేక బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో పంటలకు ఎక్కువ మోతాదులో నీరు అవసరమవుతోంది. గత నెలాఖరులో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పరిశీలించగా చాలా తగ్గినట్టు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎందుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్ రావు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. తిరపతన్న యాదగిరిగుట్ట ఎస్సై, భువనగిరి సీఐగా పనిచేశారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు.
BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.
హోలీ ఆడిన తర్వాత రంగులు కడుక్కునేందుకు వాగులో దిగగా నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడేనికి చెందిన రాంబాబు, మరో ముగ్గురు యువకులు హోలీ సందర్భంగా రంగులు పూసుకున్నారు. అనంతరం రంగులు కడుక్కునేందుకు వాగులో దిగారు. రాంబాబు కాళ్లు జారి వాగులో మునిగి మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.
ఉమ్మడి ADB వ్యాప్తంగా హోలీ పండుగ రోజు 9మంది మృతి చెందారు. హోలీ ఆడి స్నానానికి వెళ్లిన నలుగురు వార్థా నదిలో మునిగి మృతి చెందారు. దండెపల్లిలోని గూడెం లిఫ్ట్ కాలువలో పడి కార్తీక్.. వాగులో పడి ADBకి చెందిన హర్షిత్, సారంగాపూర్కి చెందిన పెద్ద ఎర్రన్న మరణించారు. నిర్మల్కు చెందిన జాదవ్ గణేశ్ ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుతో చనిపోగా.. బెల్లంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు.
కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి అవిశ్వాస తీర్మానానికి తెరలేచింది. ఈ నెల 30న తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల కింద BRS అధికారంలోకి రాగా ఛైర్పర్సన్ పదవిని అదే పార్టీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సభ్యులు అవిశ్వాస ప్రక్రియకు సిద్ధమయ్యారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 27 మంది, BRS నుంచి 8 మంది సభ్యులు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ తానయ్య తెలిపారు. హుజరాబాద్ పెద్ద పాపయ్యపల్లి నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీలో, పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో, జగిత్యాల(D) కోరుట్ల రవి బీడీ వర్క్స్ కార్యాలయంలో, సిరిసిల్ల (D) పెద్దూరు గ్రీన్ నీడిల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5:45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
HYD ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.