Telangana

News March 20, 2024

ADB: హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌కు

image

ఒకరిపై కత్తితో దాడిచేసి కేసులో ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోలిపూరకు చెందిన మునీర్ బేగ్‌పై సోమవారం రాత్రి 11 గంటలకు కేఆర్కే కాలనీకి చెందిన షేక్ షాబాద్, సయ్యద్ రెహాన్ హష్మీ కత్తితో దాడితో చేశారు. బాధితుడి తల్లి గులాబ్ బీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News March 20, 2024

MBNR: తల్లి మృతి.. పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి!

image

కన్నతల్లి కళ్ల ముందే నిర్జీవంగా మారగా.. ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో పదోతరగతి పరీక్షకు హాజరైన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. దేవరకద్ర పట్టణానికి చెందిన అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. ఆమె రెండో కూతురు జ్యోతి ఓవైపు తల్లి మృతితో కన్నీటి పర్యంతం అవుతూనే.. మరోవైపు మంగళవారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.

News March 20, 2024

బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం <<12887148>>అర్ధరాత్రి <<>>జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మృతులు వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన పఠాని రిషి, ముప్కాల్‌‌కు చెందిన ఉద్ధవ్‌గా పోలీసులు గుర్తించారు.

News March 20, 2024

ప్రతి మహిళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

image

నల్గొండ జిల్లా సమాఖ్య భవనంలో పార్లమెంటు ఎన్నికల స్వీప్ కార్యక్రమాలలో భాగంగా క్రమబద్ధమైన ఓటరు విద్య పై మహిళా సంఘాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతి మహిళ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, అడిషనల్ DRDO శారద పాల్గొన్నారు.

News March 20, 2024

ఏప్రిల్‌ 25 నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి జరగనున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 3నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.

News March 20, 2024

హైదరాబాద్‌‌లో మొదలైన సందడి..!

image

రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT

News March 20, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు నిజామాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం కామారెడ్డిలోనూ వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
SHARE IT

News March 20, 2024

హైదరాబాద్‌‌లో మొదలైన సందడి..!

image

రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

నల్గొండ, భువనగిరిలో మొదలైన సందడి..!

image

ఉమ్మడి నల్గొండలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 11, BRS 1 ఓ చోట విజయం సాధించాయి. ఖాతా తెరవకున్న బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

error: Content is protected !!