Telangana

News March 25, 2024

HYD: అందుకే ప్రణీత్‌ను చంపాడు..!

image

HYD బాలానగర్ PS పరిధిలో నిన్న <<12919309>>యువకుడు ప్రణీత్ తేజ(20)ను<<>> అతడి స్నేహితుడు చంపిన విషయం తెలిసిందే. సీఐ నవీన్ తెలిపిన వివరాలు.. ప్రణీత్, సమీర్(20) చిన్న నాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. ఈక్రమంలో తన తల్లిని ప్రణీత్ బూతులు తిట్టాడని కోపం పెంచుకున్న సమీర్.. స్థానికంగా పార్కింగ్ చేసిన బస్సులోకి ప్రణీత్‌ను తీసుకెళ్లి దారుణంగా చంపాడు.

News March 25, 2024

HYD: అందుకే ప్రణీత్‌ను చంపాడు..!

image

HYD బాలానగర్ PS పరిధిలో నిన్న <<12919309>>యువకుడు ప్రణీత్ తేజ(20)ను<<>> అతడి స్నేహితుడు చంపిన విషయం తెలిసిందే. సీఐ నవీన్ తెలిపిన వివరాలు.. ప్రణీత్, సమీర్(20) చిన్న నాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. ఈక్రమంలో తన తల్లిని ప్రణీత్ బూతులు తిట్టాడని కోపం పెంచుకున్న సమీర్.. స్థానికంగా పార్కింగ్ చేసిన బస్సులోకి ప్రణీత్‌ను తీసుకెళ్లి దారుణంగా చంపాడు.

News March 25, 2024

సి-విజిల్ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది: కలెక్టర్

image

ఖమ్మం: ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సి- విజిల్ చురుకైన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి. వి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం సి-విజిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించిందన్నారు. సి- విజిల్ అనేది యూజర్ ఫ్రెండ్లీ యాప్, పౌరులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

News March 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు. @ కమలాపూర్ మండలం లో ఆటో బోల్తా పడి యువకుడి మృతి. @ కోనరావుపేట మండలంలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో ఎస్సారెస్పీ కాలువలో పడి మానసిక దివ్యాంగుడు మృతి. @ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు. @ గోదావరిఖనిలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు.

News March 25, 2024

ఈనెల 27 పర్ణశాల,28 భద్రాచలంలో హుండీల లెక్కింపు

image

దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో ఈనెల 27న, భద్రాచలం దేవస్థానంలో ఈనెల 28న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి హుండీ, లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గమనించాలని తెలియజేశారు.

News March 25, 2024

సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరి మృతి

image

బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారు రాజీవ్ రహదారి మీద ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాజకుమారి మృతి చెందినట్లు SI కృష్ణారెడ్డి తెలిపారు. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 25, 2024

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 25, 2024

ఎండపల్లి: పండగరోజు భగ్గుమన్న గ్రామాలు

image

జిగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి-గుల్లకోట గ్రామాల మధ్య భూసరిహద్దు సమస్య సోమవారం రోజున తారస్థాయికి చేరింది. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టకు ఉపాధి కూలీ పనులకు వెళ్తుంటే గుల్లకోట మాజీ సర్పంచ్ గ్రామస్థులతో కలిసి తమ సరిహద్దులో ఉన్న గుట్టకు ఉపాధిపని కోసం రావద్దన్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

News March 25, 2024

అడుగంటిన పాలేరు రిజర్వాయర్

image

పాలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం 7.45అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రతిరోజు మూడు జిల్లాలకు కలిపి 15 టీఎంసీల నీటిని నాలుగు స్కీముల ద్వారా మిషన్ భగీరథకు వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను పాలేరు రిజర్వాయర్ అధికారులు కోరారు. ఈ నెలాఖరులోగా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంది.

News March 25, 2024

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భేటీ

image

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారని విద్యాసాగర్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సారి ఖమ్మం స్థానం బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.