Telangana

News March 20, 2024

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు స్వాగతం.. శ్రీనివాస్ గౌడ్

image

బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు BRSలో చేరిన సందర్భంగా స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRSలో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు BRS పార్టీలో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు.

News March 20, 2024

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి: కలెక్టర్ సంతోష్

image

లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దు లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. నగదు మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. సీ విజిల్ యాప్ ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.

News March 20, 2024

MBNR: పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ సభలు

image

ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, BJP విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో CM రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ MBNR, NGKL స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే పాలమూరుకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తాజాగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

News March 20, 2024

‘ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయండి’

image

జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉంటూ సజావుగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతి ఒక్కరు కృతనిశ్చయంతో అప్రమత్తతో విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.

News March 20, 2024

25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

image

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.

News March 20, 2024

25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

image

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.

News March 20, 2024

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

image

కామారెడ్డి, జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్.డి.ఓ.లు, డి.ఎస్పీలు, తహశీల్ధారు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.

News March 20, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి : ఎస్పీ

image

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం నిర్వహించిన జిల్లా సిబ్బందితో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన విస్తృత స్థాయిలో కల్పించాలని సూచించారు.

News March 20, 2024

సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలి- సీపీ

image

స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీపీ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి , 15 ఎస్ఎస్టి , 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు చెప్పారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అటు ప్రజలతో మర్యాదగా మెలగాలని పేర్కొన్నారు.

News March 20, 2024

మల్కాజిగిరిలో పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి

image

మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.

error: Content is protected !!