India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023లో 47, 2024లో 45
మర్డర్ అటెంప్ట్లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

మాది ప్రజల పార్టీ అని, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కాంగ్రెస్ నేత, కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం గుండాలలో అంబ రామలింగేశ్వర స్వామి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. AICC సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి, నాయకులు బాలాజీ సింగ్, భూపతిరెడ్డి, సందీప్ రెడ్డి, ఆశాదీప్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023లో 47, 2024లో 45
మర్డర్ అటెంప్ట్లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో త్వరలో కొత్త మార్గాలకు 30 బస్సులు, పాత మార్గాల్లో అదనంగా మరో 30 బస్సులతో పాటు నల్గొండ, సూర్యాపేట పరిధిలో మరో 50 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రీజియన్ పరిధిలో మొత్తం 640 బస్సులు ఉండగా.. నిత్యం 2.50 లక్షల KM తిరుగుతూ సుమారు రూ.150కోట్ల ఆదాయం వస్తుంది.

భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పాత వంతెన నేటితో 59 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ వంతెనను 1965 జులై 13న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1959లో శంకుస్థాపన చేయగా రూ.70 లక్షల వ్యయంతో ముంబైకి చెందిన పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ 1965లో పూర్తి చేసింది. నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన తుప్ప నరేశ్ (36) కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్య, అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సుమారు 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు డీటీ వివరించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలల సంరక్షణకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్ 9490881098తో కూడిన కంట్రోల్ రూమ్ను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని బాల రక్షాభవన్లో ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ నంబర్కు అత్యవసరమైన సమయంలో ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. ఇంటర్మీడియట్లోని అన్ని గ్రూపులలో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి కావలసిన రెజ్యూమ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఫోటో తీసుకొని రావాలని సూచించారు. 7893822745, 9951101545, 9490065269లలో సంప్రదించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.