India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా కౌడిపల్లి శివారులో గల బతుకమ్మ తండా సమీపంలో వృద్ధుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యం భూమయ్య(70) ఆదివారం రాత్రి తన వ్యవసాయ పొలం దగ్గర హత్యకి గురయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలీంచారు. క్లూస్ టీంతో కలిసి సమాచారం సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన దేవ వరప్రసాద్.. తాజాగా ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఈమేరకు వరప్రసాద్కు జనసేన అధినేత పవన్ రాజోలు టికెట్ ఖరారు చేశారు. ఆయన 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ MD, అబ్కారీ శాఖ డైరక్టర్గా సేవలందించారు.
అగ్రికల్చర్ స్టడీ చేయాలనుకునే వారికి HYD రాజేంద్రనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, PGD ఇన్ అగ్రి వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువు మార్చి 31న ముగుస్తుందని తెలిపారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.manage.gov.in చూడండి.
అగ్రికల్చర్ స్టడీ చేయాలనుకునే వారికి HYD రాజేంద్రనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, PGD ఇన్ అగ్రి వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువు మార్చి 31న ముగుస్తుందని తెలిపారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.manage.gov.in చూడండి.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలకు రోజురోజుకు పెరుగుతూ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మార్చి నెలలోనే భానుడి ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనాలు ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. గరిష్ఠంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్లో గరిష్ఠంగా 41.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోయి ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నారు.
ఎండలకు తాళలేక విద్యార్థులు వేసవిలో బావుల్లో, చెరువుల్లో, ఈతకు వెళ్తుంటారు. ఈత నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. పెద్దల పర్యవేక్షణలోని పిల్లలు ఈతకు వెళ్లడం సురక్షితమని అధికారులు చెబుతున్నారు. ఆదివారం పాల్వంచ మండలంలో 10వ తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
రాష్ట్ర రాజధానిలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా హోలీ పండుగ జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బ్లాక్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సందర్భంగా పోలీసులు ప్రతి వీధిలో రెక్కీ నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర రాజధానిలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా హోలీ పండుగ జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బ్లాక్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సందర్భంగా పోలీసులు ప్రతి వీధిలో రెక్కీ నిర్వహిస్తున్నారు.
నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం గ్రామంలో ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండటం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. రోజంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. దీంతో ఆ గ్రామస్థులు హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. స్వామివారి కల్యాణోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు..HYDయూసుఫ్గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయిఈశ్వర్ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.