Telangana

News March 24, 2024

హైదరాబాద్‌లో నేటి TOP NEWS

image

> బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య
> చంచల్‌గూడ జైలుకు ఫోన్ ట్యాపింగ్ నిందితులు
> మీర్‌పేట్‌లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం
> HYDలో 46,61,000 నగదు పట్టివేత
> గాంధీ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
> మన్సూరాబాద్ పరిది జడ్జెస్ కాలనీలో గోవులపై దుండగులు మత్తు ప్రయోగం
> నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో సంబరాలు
> డీజిల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు
> తీగుళ్ల పద్మారావు గౌడ్ ఇంటివద్ద కోలాహలం

News March 24, 2024

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్..

image

బీజేపీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ఆరూరి రమేష్ ను పార్టీ అధిష్టానం నియమించింది. 2014, 2018వ సంవత్సరాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరూరి రమేష్ వారం రోజుల క్రితం తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, ఆరూరి రమేష్ బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరగానే వారికి ఎంపీ టికెట్ లభించింది.

News March 24, 2024

వరంగల్: ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి: మంత్రి

image

వరంగల్: హోలీ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతి ప్రసాదించిన రంగులే మన జీవితంలోని పలు దశలను ప్రతిబింబిస్తాయని, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని పండుగలా ఆస్వాదించాలనే సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 24, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒రేపే హోలీ.. ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి: ఉమ్మడి జిల్లా పోలీసులు
✒NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి
✒CONGRESS, BJPలలో భారీ చేరికలు
✒SDNR:RTC బస్సులో రూ.16,50 లక్షల నగదు, వెండి సీజ్
✒NRPT:పత్తి మిల్లు దగ్ధం.. రూ.8 కోట్ల ఆస్తి నష్టం
✒MBNR:MLC ఉప ఎన్నిక.. గోవాకి వెళ్లిన ప్రజాప్రతినిధులు
✒‘టెట్ దరఖాస్తు రుసుం తగ్గించండి’.. పలుచోట్ల నిరసన
✒ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న MP అభ్యర్థుల ప్రచారం

News March 24, 2024

కామారెడ్డి: బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు

image

జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు కామారెడ్డి జిల్లాకు చెందిన అతిమాముల రామకృష్ణా గుప్త.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు. కేంద్రంలో మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు తెలిపారు.

News March 24, 2024

HYD: బేగంబజార్‌లో రూ.25 లక్షలు పట్టివేత

image

ఎన్నికల నేపథ్యంలో HYD బేగంబజార్ విష్ణు ఫైర్ వర్క్ సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా యాదాద్రి జిల్లాకు చెందిన కిరణ్ రెడ్డి, కళ్లెం జంగారెడ్డి యాక్టివాపై రావడంతో ఆపి తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద రూ.25 లక్షలు లభించగా డబ్బులకు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డబ్బులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.

News March 24, 2024

HYD: బేగంబజార్‌లో రూ.25 లక్షలు పట్టివేత 

image

ఎన్నికల నేపథ్యంలో HYD బేగంబజార్ విష్ణు ఫైర్ వర్క్ సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా యాదాద్రి జిల్లాకు చెందిన కిరణ్ రెడ్డి, కళ్లెం జంగారెడ్డి యాక్టివాపై రావడంతో ఆపి తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద రూ.25 లక్షలు లభించగా డబ్బులకు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డబ్బులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.

News March 24, 2024

కొందుర్గు: లారీ ఢీకొని ఒకరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొందుర్గు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెక్కలోనిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(54) టీవీఎస్ వాహనంపై కొందుర్గు వైపు వెళ్తుండగా గొర్రెలు అడ్డు వచ్చాయి. గొర్రెలు తప్పించే ప్రయత్నంలో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం

image

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం చండీ హోమం వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ, పూజారులు చండీ హోమంను కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

News March 24, 2024

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం

image

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం చండీ హోమం వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ, పూజారులు చండీ హోమంను కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.