India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ తదితరులున్నారు.

హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాశం భాస్కర్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై నియమించిన మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం శుక్రవారం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సీఐ జితేందర్ రెడ్డితో పాటు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా SP రోహిత్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ, కానిస్టేబుళ్లు వేధింపులు గురి చేస్తున్నారంటూ, గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మరణించిన విషయం తెలిసిందే. అటు సీఐ, కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.160 పెరిగింది. నిన్న రూ.7,300 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,460కి చేరింది. ఈ వారంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ధరలు మరింత పెరగాలని ఆ దిశగా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదట ఈ హోదా పొందిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఏటా రూ.12 లక్షల నిధులు(UGC), రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, ప్రతి విభాగం బలోపేతం, నూతన కోర్సులు, క్షేత్ర పర్యటనలపై దృష్టి కేంద్రీకరించి ఉద్యోగావకాశాలు పెంచి మహిళా సాధికారతకు పెద్ద పీట వేయనున్నారు.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో PG వార్షిక పరీక్షల తేదీలు మారాయని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగాల్సిన PG రెండో సంవత్సర పరీక్షలు AUG 20 నుంచి 25 వరకు జరుగుతాయన్నారు. ఆగస్టు 9 నుంచి 13 వరకు జరగాల్సిన PG మొదటి సంవత్సరం పరీక్షలు SEP 20 నుంచి 25 వరకు జరుగుతాయని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. SHARE IT

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం 12 అడుగులు ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 13 8 అడుగులకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు మరో 0.7 అడుగులు పెరిగి 14.5 అడుగులకు చేరుకోనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ లక్షలు కాజేసింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంది. స్టాఫ్ నర్సు, క్లర్క్ జాబ్ అంటూ నమ్మించి 28 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున వసులు చేసి ఫోర్జరీ సంతకాలతో నకిలీ జాబ్ ఆర్డర్లు ఇచ్చింది. పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయట పడింది.

పదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకంలో ఏటా ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించాలనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తుండడంతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. MBNR-2,19,500, NGKL-3,18,610, GDWL-1,72,457, NRPT-1,82,992, WNPT-1,82,073 మంది పదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల పదిశాతం అంతకంటే తక్కువే ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.