India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,23,814 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 8,39,640 మంది, పురుష ఓటర్లు 7,84,043 మంది ఉండగా, మహిళా ఓటర్లు 55,597 మంది ఎక్కువ. ఇంకా ఎన్ఆర్ఐ ఓటర్లు 222, సర్వీస్ ఓటర్లు 886 మంది ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 3,22,259 మంది, తక్కువగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,58,647 మంది ఓటర్లు ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పలు రకాల సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,400 ధర పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17వేల ధర రాగా, 5531 మిర్చికి రూ.13వేల ధర, టమాటా రకం మిర్చికి రూ.37,000 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బాలగౌని శేఖర్ గౌడ్ (25) శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శేఖర్ గౌడ్ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్(SC) పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఇతర నేతల చేరికపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే తమ అభ్యర్థి భరత్ కోసం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై బీజేపీ లెక్కలు వేస్తోండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి నాగర్కర్నూల్ అభ్యర్థి ఎవరన్నది తెలాల్సి ఉంది.
ఇటీవల ఓ మగశిశువును ముళ్లపొదల్లో పడేసిన ఘటన భీంపూర్లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలికగా గుర్తించారు. సదరు బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వరుసకు బావనే గర్భం దాల్చడానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
10వ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కష్టపడి చదివిన అంశాలను రాయాలని ఉత్తమ ఫలితాలతో ముందంజలో నిలవాలన్నారు.
మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న ఈ జలాశయం.. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు తాగునీటి ఆదరువు. ఎండలు తీవ్రమైతే దీనిపై ఆధారపడిన ఈ జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లు కూడా మార్చి నెలలో పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితులున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.