Telangana

News March 24, 2024

నల్గొండలో రసవత్తర పోరు

image

నల్గొండ నుంచి ప్రధాన పార్టీలు తమ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు ఆర్థికంగా బలం ఉన్న నాయకులే. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుందని నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

News March 24, 2024

నిర్మల్: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…!

image

నిర్మల్ జిల్లా నాయకులు BRSను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ మాజీ మండల అధ్యక్షులు ఆయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి మంత్రి ఆహ్వానించారు.

News March 24, 2024

FLASH: HYD: డీజీల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

image

కోకాపేటలో కర్ణాటక నుంచి HYDకు డీజిల్‌ను తరలిస్తున్న ముఠాను శంషాబాద్ SOT పోలీసులు గుట్టురట్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్‌ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

FLASH: HYD: డీజిల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

image

కర్ణాటక నుంచి HYDకు డీజిల్‌ను తరలిస్తున్న ముఠాను కోకాపేటలో శంషాబాద్ SOT పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్‌ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

కరీంనగర్: టికెట్ ఎవరి ‘చేతి’కో

image

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కోసం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో పాటు వెలిచాల రాజేందర్‌రావు పేరు వినిపిస్తోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ప్రవీణ్ రెడ్డి పోటీచేయాల్సి ఉండగా.. పొన్నం కోసం వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించడానికి అధిష్ఠానం యోచించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే రెడ్ల ఎక్కువ టికెట్లు వెళ్తుండటం ఇతరులకు టికెట్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

News March 24, 2024

అరబ్ వస్తువులకు కేరాఫ్ బార్కాస్ బజార్

image

హైదరాబాద్‌లోని ‘బార్కాస్’ అరబ్ సంస్కృతికి నిలయం. వహ్లాన్, బామ్స్, ఆవర్గీ, యాఫై, బహమాద్, కసేరీ తదితర కుటుంబీకులు ఇక్కడ నివసిస్తున్నారు. సూది, నెయిల్ కట్టర్, అత్తర్, టీవీలు, బుర్ఖా, ఖర్జూర్, ఉద్దాన్, షేవింగ్ కిట్, పాదరక్షలు ఇలా అతి చిన్న వస్తువులను ఇండోనేషియా, ఇటలీ తదితర దేశాల్లో తయారైనవే వినియోగిస్తుంటారు. బార్కాస్‌లోని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లుంగీలు వాడతారు.

News March 24, 2024

కేశంపేట: పదో తరగతి విధుల నుంచి తొలగింపు

image

కేశంపేట మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో పదోతరగతి పరీక్ష శనివారం జరిగింది. కానిస్టేబుల్ వివరాల ప్రకారం.. నిడదవెళ్లి గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్ పరీక్ష కేంద్రానికి కార్‌లో వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రం సీఎస్ నర్సింహులు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ కృష్ణయ్యలను విధుల నుంచి తప్పించారు.

News March 24, 2024

అరబ్ వస్తువులకు కేరాఫ్ బార్కాస్ బజార్

image

హైదరాబాద్‌లోని ‘బార్కాస్’ అరబ్ సంస్కృతికి నిలయం. వహ్లాన్, బామ్స్, ఆవర్గీ, యాఫై, బహమాద్, కసేరీ తదితర కుటుంబీకులు ఇక్కడ నివసిస్తున్నారు. సూది, నెయిల్ కట్టర్, అత్తర్, టీవీలు, బుర్ఖా, ఖర్జూర్, ఉద్దాన్, షేవింగ్ కిట్, పాదరక్షలు ఇలా అతి చిన్న వస్తువులను ఇండోనేషియా, ఇటలీ తదితర దేశాల్లో తయారైనవే వినియోగిస్తుంటారు. బార్కాస్‌లోని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లుంగీలు వాడతారు.

News March 24, 2024

ఖమ్మం: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

image

గాంధీనగర్ కాలనీ వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని వత్సవాయికి చెందిన గుర్రం శేషగిరిరావు బైక్‌పై ఖమ్మం నుంచి వత్సవాయికి వెళ్తున్నాడు. అదే సమయాన బోనకల్ మండలం మోటమర్రి చెందిన వెంకటరావు ఖమ్మం వైపు వెళుతుండగా గాంధీనగర్ కాలనీ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శేషగిరిరావు మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News March 24, 2024

వరంగల్: జూపార్క్‌కు త్వరలో పెద్దపులి

image

ఓరుగల్లు వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్దపులి త్వరలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండలోని కాకతీయ జూపార్కులో సిద్ధం చేస్తున్నారు. రూ.60 లక్షల వ్యయంతో ఇక్కడ దీనికోసం ప్రత్యేక ఎంక్లోసర్ సిద్ధమైంది. పులికి నివాసయోగ్యమైన అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. అడవి వాతావరణం ఉండటం వల్ల అది స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారిణి లావణ్య తెలిపారు.