India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కళ్ల ముందే కన్నతండ్రి నిర్జీవంగా మారగా.. ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో పదోతరగతి పరీక్షకు హాజరైన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా పుల్కల్ మండలంలో చోటుచేసుకుంది. గొంగ్లూరుకు చెందిన ఆకుల గొంగయ్య(41) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. అతని మొదటి కుమార్తె భవాని పదోతరగతి చదువుతోంది. ఓవైపు తండ్రి మృతితో కన్నీటి పర్యంతం అవుతూనే.. మరోవైపు శనివారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 28న జరగనున్న సందర్భంగా కాంగ్రెస్, BRS పార్టీ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మారిన రాజకీయ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్ పేట మండలాలకు చెందిన BRS ప్రజా ప్రతినిధులు ఇటీవల రెండు ప్రైవేటు బస్సుల్లో గోవా శిబిరానికి తరలి వెళ్లారు.
MNCL జిల్లా కాసిపేటలో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు యత్నించింది. కాసిపేటకి చెందిన యువతి ASF జిల్లాలోని ఓ మండలంలో వైద్యురాలిగా పనిచేసేది. అదే మండలంలో విధులు నిర్వర్తించే ఓ వైద్యాధికారితో ఆమెకు పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారింది. ఈక్రమంలో అతను మరోకరితో ప్రేమాయణం నడిపారు. విషయం ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. మానసిక వేదనకు గురైన వైద్యురాలు విషం తాగగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
✔వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలోని పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న క్షయ వ్యాధి సర్వే
✔NRPT:నేడు ‘రజాకార్’ సినిమా ప్రదర్శన ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(SUN):6:35, జోహార్(MON):4:56 ✔పలు నియోజకవర్గలో స్థానిక MLAల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు ✔MBNR:హోలీ..ప్రత్యేక రైళ్లు ✔ఎన్నికల కోడ్.. కొనసాగుతున్న తనిఖీలు ✔DSC(SA) ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని అన్నారు. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని అధికారులు తెలయజేశారు.
నీటిని, సహజ వనరులను సంరక్షించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పిలుపునిచ్చారు. వరల్డ్ వాటర్ డేను పురస్కరించుకొని శనివారం నీటి సంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రజా పనుల్లో కాంక్రీటు, టైల్స్ను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు.
అనిశాకు చిక్కిన MHBD సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. ఈనెల 16న WGL జిల్లాలో ఏసీబీ న్యాయస్థానాన్ని ప్రారంభించగా.. ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన MHBD సబ్రిజిస్ట్రార్ తస్లీమా, పొరుగు సేవల ఉద్యోగి ఎ.వెంకట్ను శనివారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు వారిద్దరిని కరీంనగర్ జైలుకు తరలించారు.
జగిత్యాల మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డేకు చిట్టాపూర్ వెళ్లాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్లాడు. శివకుమార్కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
హోలీ సందర్భంగా సమ్మతి లేకుండా రంగులు చల్లడాన్ని, వీధులు, వాహనాలపై గుంపులుగా సంచరించడాన్ని నిషేధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ ఆదేశాలిచ్చారు. ఈ నిబంధనలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతేగాకుండా నేడు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని చెప్పారు.
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డే కు చిట్టాపూర్ వచ్చాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్ళాడు. శివకుమార్కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.