India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.
ఈసారి ఎన్నికల్లో డబ్బు, శరీర బలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు మోడల్ కోడ్ అమలుతో పలు చర్యలు చేపట్టారు. అంతరాష్ట్ర సరిహద్దులు తగిన చెక్పోస్టుల ఏర్పాటు చేశారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వెల్లడించారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది. కొల్లాపూర్ జగదీశ్వరరావుకు స్టేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ పదవి వచ్చింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. కానీ ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. ఎగ్జామ్ హాలులోకి అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేస్తున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు.
మంచిర్యాలలోని లక్ష్మీ నగర్లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొనిజర్లలో జరిగింది. కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మల్లుపల్లికి చెందిన ఉపేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.
HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్లో జోష్ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూనే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
Sorry, no posts matched your criteria.