Telangana

News March 24, 2024

అర్ధరాత్రి చలో చార్మినార్!

image

రంజాన్‌ సందడి మొదలుకావడంతో ఓల్డ్ సిటీ కిక్కిరిసిపోతోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రి జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు చలో చార్మినార్‌ అంటున్నారు. HYD వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు నగరానికి వచ్చిన వారు, విదేశీయులు రంజాన్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

News March 24, 2024

అర్ధరాత్రి చలో చార్మినార్!

image

రంజాన్‌ సందడి మొదలుకావడంతో ఓల్డ్ సిటీ కిక్కిరిసిపోతోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రి జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు చలో చార్మినార్‌ అంటున్నారు. HYD వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు నగరానికి వచ్చిన వారు, విదేశీయులు రంజాన్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

News March 24, 2024

మంత్రి పొన్నం ఆత్మ గౌరవ స్టార్: వొడితల ప్రణవ్ 

image

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ కాదని.. ఆత్మగౌరవ స్టార్ అని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వోడితల ప్రణవ్ తెలిపారు. ఆత్మగౌరవ స్టార్ కాబట్టే.. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రిని భర్తరఫ్ చేయించే అర్హత, విమర్శించే స్థాయి కౌశిక్‌కు ఉందా అని ప్రశ్నించారు. మంత్రిని పట్టుకొని పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తారా..? అలా మాట్లాడడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమన్నారు.

News March 24, 2024

పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి డీఈవో లేఖ

image

వరంగల్ నగరంలోని కరీమాబాద్ SRR తోట ప్రాంతంలో ఉన్న వాణి విద్యానికేతన్ స్కూల్‌పై వివిధ విద్యార్థి సంఘాలు వినతి పత్రం సమర్పించడంతో డీఈవో వాసంతి స్పందించారు. శనివారం ఆర్జేడీకి ప్రొసీడింగ్ లేఖ పంపించారు. ఒక పర్మిషన్ మీద రెండు బ్రాంచీలు నడిపిస్తున్న వాణి విద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి పంపించారు. ఈ మేరకు AIFDS వామపక్ష విద్యార్థి సంఘాలు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపాయి.

News March 24, 2024

కూసుమంచి , ఖమ్మం మీదుగా కొత్త రైల్వే లైన్

image

డోర్నకల్‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వేలైన్‌ మంజూరు కాగా.. నిర్మాణానికి సర్వే పూర్తికావడంతో మార్కింగ్‌ ఇస్తున్నారు. ఈ రైల్వేలైన్‌ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 24, 2024

మిర్యాలగూడ విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి 

image

రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.

News March 24, 2024

NRPT: నేడు రజాకార్ సినిమా ఉచిత ప్రదర్శన

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మహేశ్వరీ థియేటర్‌లో BJP ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను ఆదివారం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పార్టీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు తెలిపారు. తెలంగాణ చరిత్ర, రజాకార్ల అణచివేత, ప్రజలు పడిన కష్టాలు, విముక్తి పొందిన చరిత్రను దర్శకుడు అద్భుతంగా చూపించారన్నారు.

News March 24, 2024

హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..!

image

నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

News March 24, 2024

హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..!

image

నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

News March 24, 2024

సికింద్రాబాద్‌ చరిత్రలో ఆ పార్టీలదే హవా!

image

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ హవా కొనసాగింది. లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ సార్లు ఇక్కడ హస్తం అభ్యర్థులే గెలుపొందారు. 1957లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్.. 11 సార్లు గెలిచింది. అలాగే బీజేపీ ఐదు సార్లు గెలిచింది. కాంగ్రెస్ జోరుకు 1991లో బీజేపీ అడ్డుకట్ట వేసింది. కాగా గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.