India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా విస్తరించటంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కోకాపేటలో 220/132/33KV సామర్థ్యం కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(GISS) నిర్మించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిని ఏకంగా రూ.498 కోట్లతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్ కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎండీ రజ్వి తెలిపారు.

ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా విస్తరించటంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కోకాపేటలో 220/132/33KV సామర్థ్యం కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(GISS) నిర్మించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిని ఏకంగా రూ.498 కోట్లతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్ కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎండీ రజ్వి తెలిపారు.

HMDA పరిధి జవహర్నగర్లో 2000 ఎకరాలకు పైగా, మియాపూర్లో 445 ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్, శంషాబాద్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, మూసాపేట, సరూర్నగర్, బాటసింగారం, మంగళపల్లి, తుర్కయంజాల్, తొర్రూరు, మేడిపల్లి, షాబాద్, బహదూర్పల్లి, బాచుపల్లి, కోహెడ, పెద్ద అంబర్పేట, కుర్మాల్గూడ, తెల్లాపూర్, పటాన్చెరు, కందిలోనూ HMDA భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే తొలి విడత EAMCET కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాలలో ఈ తొలివిడత కౌన్సెలింగ్ జులై 6, 7, 8 తేదీల్లో జరగనుంది. కౌన్సెలింగ్ కు వచ్చే విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే తేదీ స్లాట్ను బుక్ చేసుకోవచ్చు.

HMDA పరిధి జవహర్నగర్లో 2000 ఎకరాలకు పైగా, మియాపూర్లో 445 ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్, శంషాబాద్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, మూసాపేట, సరూర్నగర్, బాటసింగారం, మంగళపల్లి, తుర్కయంజాల్, తొర్రూరు, మేడిపల్లి, షాబాద్, బహదూర్పల్లి, బాచుపల్లి, కోహెడ, పెద్ద అంబర్పేట, కుర్మాల్గూడ, తెల్లాపూర్, పటాన్చెరు, కందిలోనూ HMDA భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

HMDA భూములకు సంబంధించి GIS డిజిటల్ మ్యాపింగ్ చేసే ప్రక్రియ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొబైల్లో యాప్ ఓపెన్ చేస్తే చాలు అరచేతిలో భూముల వివరాలు, హద్దులతో సహా కనిపించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. HMDAకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260 ఎకరాలను కేటాయించింది. నగర శివారు జిల్లాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న పానగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మందులను, అటెండెన్స్ రిజిస్టర్ ను, సౌకర్యాలను, ఔట్ పేషెంట్ ,ఇన్ పేషెంట్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, వార్డులను ఆయన పరిశీలించారు.

నిజామాబాద్ జిల్లా మ్యాట్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రెటరీ దేవేందర్ తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో గల రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. పురుషులకు ఫ్రీ స్టైల్ విభాగంలో, గ్రీకో రోమన్ విభాగంలో, అదేవిధంగా మహిళలకు ఫ్రీ స్టైల్ లో కేటాయించిన కేటగిరీలలో ఎంపికలు ఉంటాయన్నారు.

రేపటి నుంచి లష్కర్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమవుతుందని ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం పలు విషయాలు వెల్లడించారు. జులై 7న ఘటోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 21న సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఉ. 3:30కి CM రేవంత్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారన్నారు. 22న రగం(భవిష్యవాణి) ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

రేపటి నుంచి లష్కర్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమవుతుందని ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం పలు విషయాలు వెల్లడించారు. జులై 7న ఘటోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 21న సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఉ. 3:30కి CM రేవంత్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారన్నారు. 22న రగం(భవిష్యవాణి) ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.