Telangana

News March 23, 2024

MBNR: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ వాసి శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న HYDలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రేయసి గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

HYD: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

HYD: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ?

image

BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆరూరి రమేష్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అవ్వగా.. ఈ పదవిని ఎవరికి ఇస్తారో అని సందిగ్ధం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కార్యకర్తలు, సీనియర్ లీడర్లు చాలామంది పార్టీ ఫిరాయించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్, పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డిలలో ఎవరో ఒకరికి ఈ పదవి రానున్నట్లు సమాచారం.

News March 23, 2024

మహబూబ్ నగర్: త్రాగునీటికి నిధులు విడుదల!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పురపాలికలకు మంచినీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.NGKL-రూ.59.79 కోట్లు,WNPT-రూ.128.29 కోట్లు,MBNR-రూ.341.25 కోట్లు, NRPT- రూ.55.57 కోట్లు,GDWL- రూ.89.46 కోట్లు మంజూరయ్యాయి.వేసవిలో భూగర్భ జలాలు ఇంకి తరచూ పట్టణాల్లో తాగు నీటి సమస్య తలెత్తుతోంది.ఈ క్రమంలో అమృత్-2లో సమస్యకు చెక్ పెడుతూ నిధులు విడుదల చేశారు.

News March 23, 2024

ADB: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లే కీలకం

image

ప్రత్యేక ఓటరు సవరణ తుది జాబితా ప్రకారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 16,43,604 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,02,267 మంది పురుషులు, 8,41,250 మంది మహిళలు, 87 మంది ఇతరులు ఉన్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం సిర్పూర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ అభ్యర్థుల జయాపజయాల్లో మహిళా ఓటర్లే కీలకం.

News March 23, 2024

సిరిసిల్లలో ఇద్దరు కార్యదర్శులు సస్పెండ్

image

సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీవో వీర బుచ్చయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిళ్ల రాజు, వేములవాడ రూరల్ మండలం నెమలి గుండపల్లి పంచాయతీ కార్యదర్శి హరి ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కావట్లేదని పేర్కొన్నారు.

News March 23, 2024

సెన్సార్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ గుప్తా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

image

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, సెన్సార్ బోర్డ్ మెంబర్ కామారెడ్డికి చెందిన రామకృష్ణ గుప్తా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని తెలిపారు. నాయకుల అంతర్గత రాజకీయాల వల్ల ఇబ్బందులకు గురై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు వెల్లడించారు.

News March 23, 2024

MBNR, NGKL అభ్యర్థుల ఖరారు.. ఇక వ్యూహాలపై కసరత్తు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్ సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీల ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. స్థానికంగా సమీకరణాలు శరవేగంగా మారుతున్న తరుణంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే పలువురు నేతలు గ్రామాల వారిగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.

News March 23, 2024

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామ శివారులోని మహి గ్రానైట్ పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పరిశ్రమలో విధులు ముగించుకొని వెళ్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువకుడు అమిత్ కుమార్ సింగ్(32) అనే కార్మికుడిని బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.