India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

√WNP: సైబర్ నేరాల పట్ల ప్రజల ప్రమాదంగా ఉండాలి:SP.√GDL: బావి తవ్వుతుండగా మట్టి కూలి ఒకరి మృతి.√MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్.√MBNR: రాజాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం వ్యక్తి మృతి.√SDNR: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి చెందాడని ఆందోళన.√ దౌల్తాబాద్: టీచర్ బదిలీ విద్యార్థుల కన్నీళ్లు.√ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలు.

హన్మకొండ కలెక్టరేట్లో ఈరోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుండగా <<13521309>>పవర్ కట్<<>> విషయమై ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వివరాలు తెలిపింది. హన్మకొండ కలెక్టరేట్కు 11కేవీ ఫీడర్పై విద్యుత్ సరఫరా బంద్ లేదని ఎక్స్లో సంబంధిత అధికారులు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా కలెక్టరేట్లో సిబ్బంది ముందస్తు టెస్టింగ్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం అవాస్తవమన్నారు.

ఓ వ్యక్తి తన గొంతును స్త్రీ గొంతుగా మార్చి బాధితున్ని హనీ ట్రాప్ చేసి డబ్బులు కాజేసిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. ఈ మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్కు సంబంధించిన నేరంలో నిందితుడిని పట్టుకొని జిల్లా కోర్టులో హాజరు పరచగా, అతనికి జైలు శిక్ష విధించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు సూచించారు.

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడులో తీవ్ర విషాదం జరిగింది. విద్యుద్ఘాతంతో వీరేందర్, జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దండెంపై టవల్ ఆరేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

టీపీసీసీ సభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబి శౌరి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెళ్లారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, టీసీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. డిఎస్సీ పరీక్ష కొంతకాలం పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు ఇటీవల నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఉప్పల్లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్ పరిధి శ్రీనివాసపురం వాసి దినేశ్ కుమార్(36) మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. విధులు ముగించుకొని గురువారం యాక్టివాపై ఇంటికి బయల్దేరాడు. Genpact వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.

ఉప్పల్లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్ పరిధి శ్రీనివాసపురం వాసి దినేశ్ కుమార్(36) మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. విధులు ముగించుకొని గురువారం యాక్టివాపై ఇంటికి బయల్దేరాడు. Genpact వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.

మంత్రి శ్రీధర్ బాబు, MLA అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరామన్నారు. దీంతో కేంద్ర మంత్రి సాగుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

భద్రాచలం వరదలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు చేపట్టాలని బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకట్రావు, జారి ఆదినారాయణ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.