Telangana

News July 2, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలంటూ 8.90 లక్షల స్వాహా

image

ట్రేడింగ్‌లో లాభాలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యాపార వేత్తకు ఎక్స్.టీబీ ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట సందేశం వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేయగా.. ఎక్స్.టీబీ ఫారెక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. మొదట అతడికి ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని నమ్మించి రూ.8.90 లక్షలు కొట్టేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

News July 2, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలంటూ 8.90 లక్షల స్వాహా

image

ట్రేడింగ్‌లో లాభాలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యాపార వేత్తకు ఎక్స్.టీబీ ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట సందేశం వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేయగా.. ఎక్స్.టీబీ ఫారెక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. మొదట అతడికి ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని నమ్మించి రూ.8.90 లక్షలు కొట్టేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News July 2, 2024

NLG: సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులు కిటకిట

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు ఆసుపత్రులకు రోగులు తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి రోగాలతో ప్రజలు విలవిలాడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, గ్రామీణులు కోరుతున్నారు.

News July 2, 2024

ఉమ్మడి జిల్లాలో జోరుగా ఫిల్టర్ ఇసుక దందా

image

ఉమ్మడి జిల్లాలో ఫిల్టర్ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతను బట్టి ఒక్కో ట్రాక్టరుకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోంది. రోజుకు రూ.1.75 కోట్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోంది. చెరువులు, కుంటల వద్ద మట్టిని, గుట్టలను తొలిచి వచ్చిన మట్టిని ఇసుకగా మారుస్తున్నారు. మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News July 2, 2024

సిద్దిపేట: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం వాటి జీరాక్స్ ఈనెల 17లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 2, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమ శేఖర శర్మ సోమవారం తెలిపారు. రెండు కాపీలను సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ధ్రువీకరణతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలన్నారు.

News July 2, 2024

BREAKING: HYD: 5 స్కూల్ బస్సులపై కేసు నమోదు

image

హైదరాబాద్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లాల్‌బంగ్లా, అమీర్‌పేట్, సికింద్రాబాద్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేశారు. ఈ మేరకు 3 ఆటోలను సీజ్ చేశామని, 5 పాఠశాలల బస్సులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News July 2, 2024

NLG: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

image

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు వివరాలు.. NLGజిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన వాసి వంశీకృష్ణ(19) HYDలో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2రోజులు రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RRజిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

News July 2, 2024

BREAKING: HYD: 5 స్కూల్ బస్సులపై కేసు నమోదు

image

హైదరాబాద్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లాల్‌బంగ్లా, అమీర్‌పేట్, సికింద్రాబాద్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేశారు. ఈ మేరకు 3 ఆటోలను సీజ్ చేశామని, 5 పాఠశాలల బస్సులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News July 2, 2024

సిద్దిపేట: ‘మాకు ఇచ్చే డబ్బులు మా పిల్లలకైనా ఇవ్వండి’

image

‘మాకు ఇచ్చే డబ్బులు మా పిల్లలకైనా ఇవ్వండి’ అంటూ చనిపోయిన తల్లిదండ్రుల పేరిట ఫ్లెక్సీని సిద్దిపేట జిల్లా దూళిమిట్టలో ఏర్పాటు చేశారు. కరుణాకర్-దివ్య దంపతులు వ్యవసాయం, కిరాణ షాపు నడుపుతూ జీవించేవారు. 4ఏళ్ల క్రితం కరెంట్ షాక్‌తో కరుణాకర్ చనిపోగా మనోవేదనతో దివ్య మృతితో పిల్లలు అనాథలయ్యారు. దీంతో షాపులో సరకులు ఉద్దెర, అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని పిల్లల పేరిట ఫ్లెక్సీని బాబాయ్ ఏర్పాటు చేశారు.