India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకానికి ఈనెల 4వ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఘనశ్యామ్ తెలిపారు. ఇవాళ జరగాల్సిన ఇంటర్వ్యూలను రేపటికి వాయిదా వేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలియజేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని ఎంగంపల్లి తండా శివారులో వ్యవసాయ పొలంలో చిరుత పులి సంచరించింది. పరిసర రైతులు పొలంలో పాదముద్రలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. వారు ఎంగంపల్లితండాలో చిరుత పులి సంచరించిన వ్యవసాయ పొలాల్లో అధికారులు పాదముద్రలను సేకరించారు. చిరుత సంచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

దమ్మపేట మండలం ముష్టిబండకి చెందిన సత్యనారాయణ పొలానికి వెళ్లి అక్కడ గుండెపోటుతో కుప్పకూలాడు. సత్యనారాయణను గమనించిన తోటి రైతులు సమీపంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి సమాచారం అందించడంతో ఆయన సత్యనారాయణకు సీపీఆర్ చేశారు. దీంతో స్పృహలోకి వచ్చిన సత్యనారాయణను స్థానికులు, రైతులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

MLA పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని MLA హరీశ్రావు ఖండించారు. ‘ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా..? ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనా..?, ఇలాంటి బెదిరింపులకు BRS భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం’ అని హరీశ్రావు Xలో పేర్కొన్నారు.

ఎక్కువ మంది అమితంగా ఇష్టపడే
బోడకాకర కాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మంలో మంగళవారం రూ.550కి కిలో చొప్పున బోడకాకర కాయలు విక్రయించారు. హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులు కిలో రూ.450 చొప్పున కొనుగోలు చేసి రూ.100 అధికంగా రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, వీధి వ్యాపారుల ప్రాంగణాల్లో విక్రయిస్తున్నారు. గతేడాది రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపైంది.

హనుమకొండ బాలసముద్రంలోని AISF జిల్లా కార్యాలయంలో SFI, AISF, PDSU, NSUI విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. జులై 4న తలపెట్టిన విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరారు. రాత పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలని ఖండించాలన్నారు.

కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు తమ దరఖాస్తులను www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పాలన, పార్టీ కార్యక్రమాలతో
నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి కల్లూరు మండలం నారాయణపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పంచుకున్నారు. పొంగులేటి ట్వీట్పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. ఉమ్మడి నల్గొండ నుంచి గాజుబిడెం బ్యాక్ వాటర్లో బస, బోటింగ్, నెల్లికల్ ఎకోపార్క్లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్ ఉండనుంది. దీంతో స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, జిల్లా అడిషినల్ కలెక్టర్ అరుణ శ్రీ, మున్సిపల్ ఛైర్మన్ మమత రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.