India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కుల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సిబ్బంది విధి నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన ఆయన.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మాట్లాడుతూ.. ‘ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. నా వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదు.’ అంటూ కీలక నిర్ణయాలు వెల్లడించారు.
ఎస్సి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు చెందిన ఎస్సీ అభ్యర్థులకు రెసిడెన్సియల్ పద్దతిలో రెండు నెలల పాటు టీఆర్టీ(DSC)పై ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. నుశిత తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదన్నారు. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా http//tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూ.15.65 లక్షలు, 690 లీటర్ల మద్యంతో పాటు 27 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే 229 గ్రాముల బంగారం, పట్టుబడిన రెడీ మేడ్ దుస్తులు విలువ రూ.21.45 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బాధితులు ఆధారాలు అందజేస్తే పరిశీలన చేసి అందచేస్తామని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గత 3 రోజుల్లో రూ.7.6 లక్షలు, నేడు రూ.4.50 లక్షల నగదుతో పాటు 986 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టాలని ఆమె సూచించారు.
జనగామ మండలం పెంబర్తిలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో గురువారం ఫుడ్ పాయిజన్తో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గురుకులం సిబ్బంది చంపక్ హిల్స్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై గురుకుల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
Sorry, no posts matched your criteria.