India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఘణపురం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పాలకుల నిరాదరణతో పూర్వ వైభవం కోల్పోయింది. నిజాం కాలంలో కళకళలాడిన ప్రాజెక్టు నేడు పూడికతో నిండిపోయింది. ప్రాజెక్టు నిండినా వారం రోజులు కూడా నీరు ఉండని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం 2016లో రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నాలుగేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటిగ్రామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లా నూతన అదనపు ఎస్పీగా వినోద్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రోజున బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలు అధికారులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. గురువారం వనపర్తి జిల్లాలోని పానగల్లో 38.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కేతపల్లిలో 38.3, గద్వాల జిల్లాలోని వడ్డేపల్లిలో 37.9, NGKL జిల్లా కోడేరులో 37.1, NRPT జిల్లాలోని ధన్వాడలో 36.9, MBNR జిల్లాలోని సేరి వెంకటాపురంలో 36.6, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా NGKL జిల్లా పద్రలో 31.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలిశారు. వారు మాట్లాడుతూ.. మువ్వ విజయ్ బాబుకు రాష్ట్ర విద్యాశాఖ మౌళిక సదుపాయాల కల్పనాధికారిగా ఛైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఛైర్మన్ మువ్వ విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం HYDలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం HYDలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.