India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగర పరిసరాల నుంచి భారీ మొత్తంలో నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి HYD హైటెక్ సిటీలో అక్రమంగా డంప్ చేస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా అందరి కళ్ల ఎదుట జరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరవయ్యారని పేర్కొన్నారు. HYDలో నిర్మాణ వ్యర్థాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయని, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నగర ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

జమ్మికుంట పత్తి మార్కెట్కు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి రెడ్డి నాయక్ తెలిపారు. ఈ నెల 5న శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, 6న శనివారం వారాంతపు యార్డు బంద్, 7న ఆదివారం సాధారణ సెలవు ఉన్నట్లు తెలిపారు. తిరిగి 8న సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించగలరని కోరారు.

HYD మియాపూర్ పీఎస్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హఫీజ్పేట్ లక్కీ హుక్కా సెంటర్లో పోలీసులు ఈరోజు తనిఖీ చేశారు. నిషేధిత హుక్కా ఫ్లేవర్లు అమ్ముతున్నట్లు గుర్తించి సెంటర్ యజమానిని అరెస్ట్ చేశారు. 250కి పైగా హుక్కా ఫ్లేవర్లు, 150కి పైగా హుక్కా పైపులను సీజ్ చేశారు.

HYD మియాపూర్ పీఎస్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హఫీజ్పేట్ లక్కీ హుక్కా సెంటర్లో పోలీసులు ఈరోజు తనిఖీ చేశారు. నిషేధిత హుక్కా ఫ్లేవర్లు అమ్ముతున్నట్లు గుర్తించి సెంటర్ యజమానిని అరెస్ట్ చేశారు. 250కి పైగా హుక్కా ఫ్లేవర్లు, 150కి పైగా హుక్కా పైపులను సీజ్ చేశారు.

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పురాతన గణపతి ఆలయంలో చోళుల కాలం నాటి సిడితల వీరమల్లు విగ్రహం లభ్యమైంది. తల నరుక్కుంటే శైవ సన్నిధికి వెళ్తామనే నమ్మకం అప్పట్లో రాష్ట్ర కూటుల సమయంలో ఉండేది. ఆ కాలంలోని శిల్పం తాజాగా బయటపడింది. రాయపోల్, జనగామ జిల్లా లింగంపల్లి, వనపర్తి జిల్లాలో మూడు వీరగల్లు చిత్రాలు బయటపడ్డాయని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.

మంచిర్యాల MCH ఆసుపత్రిలో బుధవారం రాత్రి <<13562300>>కరెంట్ కట్ <<>>అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాత్రంత కరెంట్ లేకపోవడంతో బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 డిపోల్లో సుమారు 2,115, మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.