Telangana

News March 19, 2024

క్షుణంగా తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్ హరిచందన

image

NLG:పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎఫ్ఎస్టి,ఎస్ఎస్టి బృందాలు తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. ఉదయాదిత్య భవన్లో ఎఫ్ ఎస్ టి,ఎస్ ఎస్ టి బృందాలకుద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎఫ్ ఎస్ టి బృందాలు ఒకే చోట ఉండకుండా క్షేత్రస్థాయిలో ఒక చోట నుండి మరోచోటికి వెళ్తూ తనిఖీలు నిర్వహించాలని అన్నారు.

News March 19, 2024

ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 19, 2024

ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 19, 2024

ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 19, 2024

HYD: FREE గ్యాస్.. ఖాతాల్లో రాయితీ నగదు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు HYD, RR, MDCL జిల్లాల పరిధిలో సుమారు 8 లక్షల మందికి రాయితీ డబ్బు అందినట్లు ప్రాథమికంగా వారు అంచనా వేస్తున్నారు. రీఫిల్లింగ్ బుక్ చేసిన నాటి నుంచి 3 రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. రోజూ 20 వేల మంది లబ్ధి పొందుతున్నారని అంచనా.

News March 19, 2024

HYD: FREE గ్యాస్.. ఖాతాల్లో రాయితీ నగదు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు HYD, RR, MDCL జిల్లాల పరిధిలో సుమారు 8 లక్షల మందికి రాయితీ డబ్బు అందినట్లు ప్రాథమికంగా వారు అంచనా వేస్తున్నారు. రీఫిల్లింగ్ బుక్ చేసిన నాటి నుంచి 3 రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. రోజూ 20 వేల మంది లబ్ధి పొందుతున్నారని అంచనా.

News March 19, 2024

మెదక్: రైలు నుంచి పడి యువకుడి మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం – మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్లోంచి పడి గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రయాణిస్తున్న రైల్లోంచి పడి యువకుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News March 19, 2024

కోదాడలో రూ.4,76,900 నగదు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా నగదు, ఇతర విలువైన వస్తువులు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారులో రూ.4,76,900 నగదు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ టీం అధికారి వినయ్ కుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు.

News March 19, 2024

అడ్డాకుల: కుక్కలను కాల్చి చంపిన ముగ్గురి అరెస్ట్

image

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చి చంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నడంతో గ్రామానికి చెందిన పలువురు ఈనెల 15న దాదాపు 20 కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నేడు నిందితులు నర్సింహారెడ్డి, తారిఖ్ అహ్మద్, మహమూద్ తాహీర్‌ను అరెస్ట్ చేశారు.

News March 19, 2024

ఎన్నికల నిబంధనలకు లోబడి పనిచేయాలి: కలెక్టర్ రాజర్షి షా

image

పార్లమెంట్ ఎన్నికలు సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా ఎస్పీ గౌస్ ఆలం తో కలసి పాల్గొన్నారు. పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారులకు క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల పక్రియను ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.