Telangana

News March 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔కోడ్ కూసింది.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందడి
✔పదో తరగతి పరీక్షలపై అధికారుల సమీక్ష
✔నూతన ఓటు నమోదు పై అధికారుల ఫోకస్
✔శ్రీరంగాపురం:నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
✔పలు నియోజక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(ఆది):6:34,సహార్(సోమ):5:02
✔నేడు సార్వత్రిక డిగ్రీ తరగతులు
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔NRPT:పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్

News March 17, 2024

ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా జంగా

image

కాంగ్రెస్ కోసం పని చేసినా అవకాశాలు దక్కని నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తోంది. జనగామ మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ & గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 17, 2024

ఖమ్మంలో పాగా వేసేదెవరు..?

image

KMM, MHBDలో పాగా వేయాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. MHBD స్థానం నుంచి బలరాంనాయక్‌ బరిలో ఉండగా.. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించలేదు. అటూ BRS ఈ రెండు స్థానాలను నిలబెట్టుకోవాలని అడుగులు వేస్తోంది. సిట్టింగ్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవితకు మళ్లీ టికెట్లు ప్రకటించింది. మరో పక్క BJP సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. MHBD నుంచి అజ్మీరా సీతారాంనాయక్‌ను బరిలో నిలిపింది. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

News March 17, 2024

గడ్డి మందు తాగి యువకుడు సూసైడ్ 

image

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజ్జిలాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమూరు మైపాల్ రెడ్డి అనే యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ మనస్థాపానికి గురై శుక్రవారం గడ్డి మందు తాగడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం యువకుడు మరణించాడు

News March 17, 2024

లింగంపేట: పెళ్లికి వెళ్లొస్తున్న ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

image

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. నిజాంసాగర్ మండలం సింగితం, గున్కుల్, వడ్డెపల్లి నుంచి పలువురు కొర్పోల్‌లో పెళ్లికి వెళ్లారు. రిటన్‌లో 12 మందితో వస్తున్న ఆటో బాయంపల్లి శివారులో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో సంగయ్య, లావణ్య మృతి చెందారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

News March 17, 2024

పాపన్నపేట: తండ్రిని చంపిన తనయుడు

image

పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో సంగం ప్రేమానందం(45)ను కొడుకు సందీప్ కొట్టి ఉరివేసి హత్య చేసినట్లు SI నరేశ్ తెలిపారు. తాగుడుకు బానిసైన ప్రేమానందం తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు పంచాయతీ నిర్వహించిన మార్పు రాకపోగా బుధవారం మళ్లీ గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన కొడుకు సందీప్.. తండ్రిని కొట్టి ఉరేసి చంపేశాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News March 17, 2024

HYD: వ్యభిచార గృహంపై RAIDS

image

వ్యభిచార గృహంపై బంజారాహిల్స్ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. అయితే డబ్బులకు ఆశపడి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించింది. పోలీసులు గృహంపై రైడ్ చేసి మేనేజర్ మహ్మద్ ఆదిల్‌తో పాటు కస్టమర్‌ను పట్టుకున్నారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

News March 17, 2024

బీజేపీలో విలువలు సిద్దాంతాలు లేవు: జితేందర్ రెడ్డి

image

బీజేపీలోని నాయకులకు సిద్ధాంతాలు, విలువలు లేవని.. ఈర్ష్య, అసూయ, ద్వేషం, గ్రూప్ రాజకీయాలే ఉన్నవని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఏపీ. జితేందర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు కారణం చెప్పకుండా ఎంపీ టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని అన్నారు. 50ఏళ్ల ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరని, అభ్యర్థుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

News March 17, 2024

స్వేచ్ఛాయుత ఓటింగే లక్ష్యం: రోనాల్డ్ రోస్

image

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మే 13న జిల్లా పరిధిలోని HYD, SEC పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుందని, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉపఎన్నిక ఉంటుందన్నారు. ఫిబ్రవరి 8 నాటికి లెక్కల ప్రకారం జిల్లాలో 45,70,138 మంది ఓటర్లున్నారని, గడిచిన 2 నెలల్లో 1.21 లక్షల ఓట్లు రద్దయ్యాయని, 46,574 మంది కొత్తఓటర్లు జాబితాలో చేరారన్నారు.

News March 17, 2024

HYD: వ్యభిచార గృహంపై RAIDS

image

వ్యభిచార గృహంపై బంజారాహిల్స్ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. అయితే డబ్బులకు ఆశపడి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించింది. పోలీసులు గృహంపై రైడ్ చేసి మేనేజర్ మహ్మద్ ఆదిల్‌తో పాటు కస్టమర్‌ను పట్టుకున్నారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

error: Content is protected !!