India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు, శిక్షలు విధించినా కొందరు మందు బాబులు మాత్రం మారడం లేదు. మద్యం తాగి పదేపదే దొరుకుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31వ తేదీ వరకు 7 నెలల వ్యవధిలో వెస్ట్జోన్ ట్రాఫిక్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 5,540 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.
PUకి పెద్దదిక్కు లేకుండా పోయారు. వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్ రథోడ్ మే నెలలో పదవి కాలం పూర్తికాగా… ఆయన స్థానంలో ప్రభుత్వం ఇన్చార్జి వీసీగా ఐఏఎస్ అధికారిని నియమించింది. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూనివర్సిటీకి రాలేదు. దీంతో కొన్ని అకాడమీ పరమైన అంశాల్లో నిర్ణయం, అనుమతి కోసం అధికారులే నేరుగా హైదరాబాద్ వెళ్లి సదరు IAS అధికారిని అనుమతి తీసుకోవాల్సి వస్తోంది.
కొమురవెల్లి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో <<13938111>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. చెర్యాల మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన అందే వీరేశం(36) శుభకార్యానికి వెళ్లొస్తానని బయటికి వెళ్లాడు. శనిగరం గ్రామానికి రాజీవ్ రహదారి గుండా బైక్పై వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వీరేశం వేగంగా వచ్చి కారు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత చలాన్లపై 5,6 రెట్లు పెంచి పలు నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇష్టారీతిన వాహనాలు నడిపేవారికి ముక్కు తాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత చలాన్లపై 5,6 రెట్లు పెంచి పలు నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇష్టారీతిన వాహనాలు నడిపేవారికి ముక్కు తాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు.
HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కరీంనగర్: ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజనకు కరీంనగర్ జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అన్నదాతలకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది రైతులు అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు వెయ్యి మంది మాత్రమే ఇందులో చేరారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించ కపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 52 జీహెచ్ఎం పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. SAలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సీనియార్టీ జాబితాలతో పాటు ఖాళీల వివరాలను అధికారులు ప్రకటించారు. వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, రెండు రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాదులో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన “హైడ్రా” మంచిదేనని, అయితే పేద ప్రజల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించాలన్నారు. ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.