India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువతి సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాన్యచెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. శివనగర్కు చెందిన అనిల్(29) వరంగల్ నుంచి రామగుండం కూలి పని కోసం కోర్బా రైలు ఎక్కాడు. పాత వరంగల్ రైల్వే గేట్ సమీపానికి చేరుకోగానే ప్రమాదవశాత్తు అతడు రైలు నుంచి జారిపడ్డాడు. అతడి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలవగా ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థులు, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల అశోక్నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈనెల 21వరకు సర్వే కొనసాగుతుందన్నారు.
కమల్ వాచ్ కంపనీ జ్యువెల్లరీ రంగంలో అడుగుపెడుతూ హైదారాబాద్ గచ్చిబౌలిలో మొదటి Caratlane ఫ్రాంచైజీని టోట్ల ఫ్యామిలీతో కలిసి ప్రేమలతా భాయ్ టోట్ల ప్రారంభించారు. గచ్చిబౌలిలో గూగుల్ కార్యాలయం ఎదురుగా ఈ మొట్టమొదటి నూతన షోరూమ్ను కమల్ వాచ్ ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రాలలో 56 వాచ్ స్టోర్లు, Swarovski అవుట్లెట్లు మరియు లగేజ్ స్టోర్లతో పాటు ఈ కొత్త ప్రారంభంతో తమ వ్యాపారంలో వైవిధ్యతను ప్రకటించారు.
పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల వారీగా నమోదైన నేరాల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పగడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఉచిత కోచింగ్ సెంటర్ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అంబేడ్కర్ కళాభవన్లో తన సొంత నిధులతో నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో HYDకు దీటుగా కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. కోచింగ్కు వచ్చే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి మంచి స్టడీ మెటీరియల్ను ఉచితంగా ఇస్తామన్నారు.
గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.
శివన్న గూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు 2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇతర అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదివాసీ నేతలతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.
Sorry, no posts matched your criteria.