Telangana

News September 25, 2024

సంగారెడ్డి: కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయండి..

image

జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లై డీఎం కొండల్ రావు పాల్గొన్నారు.

News September 25, 2024

NLG: ప్రాజెక్టుల పెండింగ్ పనులను వేగవంతం చేయాలి: JC

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పునరావాస కేంద్రాల పనులకు సంబంధించిన పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలు, భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టు పనులన్నింటిని వేగవంతం చేయాలని తెలిపారు.

News September 25, 2024

భద్రాద్రి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.

News September 25, 2024

మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్ర

image

మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్రకి సంబంధించిన కరపత్రాలను డా.పిడమర్తి రవి బాచుపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ నెల27, 28న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, 30, 1వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో ఈ యాత్ర జరుగనున్నట్లు తెలంగాణ మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చిరుమర్తి రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

News September 25, 2024

HYD: ఇక్కడ కేసులు సులభంగా పరిష్కరించబడును..

image

జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగించుకోవాలని DLSA కార్యదర్శి, Sr.సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. Sept 28న RR జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందన్నారు. కోర్టు ముందుకు ఇదివరకురాని, పెండింగ్, పరిష్కరించుకునే/రాజీపడే కేసులకు వేదికన్నారు. క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదా, డబ్బు రికవరీ, యాక్సిడెంట్, చిట్‌ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్కుబౌన్స్ వంటి కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

News September 25, 2024

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను సిద్ధం చేయండి: కలెక్టర్

image

ప్రముఖ ప్రజాకవి, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు పేరిట నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజి వాకడే తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

News September 25, 2024

అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక: మంత్రి కొండా

image

తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ తొలి పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ ధీరచరిత్ర ఎన్నో ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఆమె చేసిన భూ-పోరాటమే తర్వాత కాలంలో భూ సంస్కరణలకు దారి చూపిందని స్పష్టం చేశారు.

News September 25, 2024

ఖమ్మం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ఠ నిఘా ఉండాలి: కలెక్టర్

image

ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ఠ నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పరిశీలించి, పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.