India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంగాధర మండలం గట్టు బూత్కూర్ గ్రామానికి చెందిన బొమ్మరవేణి దశరథం (40) అనే వ్యక్తి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాలమూరు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని నారాయణపేట జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రధాని మోదీ విజయ సంకల్ప సభ దిగ్విజయం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో మునిగి పోయిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కానీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 600 మంది యువకులు ఆదివారం మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ… పార్టీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని సూచించారు. ఈ దేశం యువత భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు.
మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లాలో రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ షాపులను సైతం మూసివేయాలని కోరారు. కాగా జిల్లాలో 3,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు, వచ్చే జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదన్నారు.
కంగ్టి మండలం భీమ్రాలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శిరుగొండ (45) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ‘పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది. రేకుల షెడ్డు కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగు పడింది’ అని స్థానికులు PSకు సమాచారం ఇచ్చారు. కంగ్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మండలంలోని పిప్పర గొంది గ్రామానికి చెందిన రాథోడ్ చంద్రకాంత్ సైబర్ వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో కారు ధర తక్కువగా ఉన్నదని ప్రకటన రావడంతో రూ.1,43,000 చెల్లించినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. వారి నుంచి ఎలాంటి సమాదానం రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
గోషామహల్లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్ మండిపడ్డారు.
జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించినా సరైన అవకాశం రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో రాజకీయ భవిష్యత్ గురించి వెల్లడిస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.