India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకి ఉత్తమ మొదటి డిపో అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాద్లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా రూ.3 లక్షల క్యాష్ అవార్డును సత్తుపల్లి డిపో మేనేజర్ U.రాజ్యలక్ష్మీ ఈ అవార్డును అందుకున్నారు.
కరీంనగర్కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో ప్రాణాలు కోల్పోయాడు. అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఆఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండ తీవ్రతతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు విడిచారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ను నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు శాలువా కప్పి అభినందించారు.
జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షకావత్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి వెంట తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకాదర్శి వాణిప్రసాద్, తదితరులు ఉన్నారు.
HYDలో సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, నో పార్కింగ్, అర్హత లేకుండా డ్రైవింగ్ లాంటివి చేసిన వారిపై గత సంవత్సరం 14.2 లక్షల మంది పై మాత్రమే కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది మే వరకు 18.15 లక్షల మంది పై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 28% జరిమానాలు పెరిగినట్లు పేర్కొన్నారు. రోడ్లపై డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
HYDలో సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, నో పార్కింగ్, అర్హత లేకుండా డ్రైవింగ్ లాంటివి చేసిన వారిపై గత సంవత్సరం 14.2 లక్షల మంది పై మాత్రమే కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది మే వరకు 18.15 లక్షల మంది పై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 28% జరిమానాలు పెరిగినట్లు పేర్కొన్నారు. రోడ్లపై డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.
HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.