India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఈరోజు జరిగింది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని భుజరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(12) ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్నారు. గత పది రోజుల క్రితం చైనా వెళ్లిన ఎమ్మెల్యే పలు అంశాలపై అధ్యయనం చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు CSE కోర్సులో చేరేందుకు అమితాసక్తి చూపారు. ఒకప్పుడు హవా చాటిన ‘సివిల్’ ఈసారి డీలా పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అన్ని బ్రాంచిల్లో కలిపి 4,516 సీట్లు ఉన్నాయి. సీఎస్ఈ కోర్సులో 1,420 సీట్లు ఉండగా.. 1,242 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్లో 248 సీట్లకు గాను 115 మాత్రమే భర్తీ కాగా.. మెకానిల్ది అదే పరిస్థితి ఉంది.
అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామస్థులు విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి డిప్యుటేషన్ చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు, గ్రామస్థులు, మాజీ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో సిద్దిపేట మెదక్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వెంటనే డిప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బేగంపేట్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1150 అర్జీలు అందాయి. ఎస్సీ సంక్షేమం-610, విద్యుత్ శాఖ, సింగరేణి-115, పౌరసరఫరాల శాఖ-113, మైనారిటీ సంక్షేమం-85, రెవెన్యూ-69, ఇతర శాఖలకు 158 వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారిణి దివ్య అర్జీలు స్వీకరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
బేగంపేట్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1150 అర్జీలు అందాయి. ఎస్సీ సంక్షేమం-610, విద్యుత్ శాఖ, సింగరేణి-115, పౌరసరఫరాల శాఖ-113, మైనారిటీ సంక్షేమం-85, రెవెన్యూ-69, ఇతర శాఖలకు 158 వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారిణి దివ్య అర్జీలు స్వీకరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
గత ఆరు నెలలుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావాహులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారిగా ఓటర్ల జాబితా తయారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా యువత స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ప్రొ. సుధారాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 చివరి తేదీ అని వెల్లడించారు. వివరాలకు మొబైల్: 7382929570 580, 040-23680222/333/444/555, 18005 990101 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. SHARE IT
డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ప్రొ. సుధారాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 చివరి తేదీ అని వెల్లడించారు. వివరాలకు మొబైల్: 7382929570 580, 040-23680222/333/444/555, 18005 990101 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. SHARE IT
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4వ సెమిస్టర్ల ఫలితాలు విడుదల కాకపోవడంతో పీజీ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. 6వ సెమిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, 2వ, 4వ సెమిస్టర్లలో బ్యాక్ లాగ్లు ఉండటం వల్ల విద్యార్థులు సీపీగేట్ కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోతున్నారు. దీంతో 2, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.