Telangana

News August 24, 2024

MBNR: 18 ఏళ్లు నిండే వారికి అలర్ట్.!!

image

పాలమూరులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 JAN 1 వరకు 18 ఏళ్లు నిండే వారు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. OCT 10 వరకు BLOలు ఇంటింటి సర్వే, జాబితాలో ఫొటోల మార్పు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలతో OCT 29న ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, DEC 24 నాటికి పరిష్కరించి JAN 6న తుది జాబితా ప్రకటిస్తారు.

News August 24, 2024

కరీంనగర్: 9,77,472 రేషన్‌ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

image

రేషన్ కార్డు ఉన్నవారికి జనవరి నుంచి సన్నబియ్యంతోపాటు రాయితీపై గోధుమలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో వారికి ఊరట కలగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 9,77,472 రేషన్ కార్డులు ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు రేషన్ దుకాణం పంపిణీ చేసే దొడ్డు రకాలను వ్యాపారులకు విక్రయించి.. అధిక ధరలు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో సన్నరకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వారికి మేలు చేసేలా ఉంది.

News August 24, 2024

MDK: వీధి కుక్కలు భయపెడుతున్నాయ్..!

image

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లోనూ భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కుక్కల దాడులకు గురయ్యారని, పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో కుక్కల బెడద ఉందా కామెంట్ చేయండి.  

News August 24, 2024

ఉత్తర తెలంగాణకు ఎంజీఎం పెద్ద దిక్కు!

image

వరంగల్ ఎంజీఎం ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంది. రోజూ సగటున ప్రతి 30 సెకండ్లకు ఒక రోగి ఇక్కడ చేరుతున్నాడు. కరోనా సమయంలో లక్ష మంది రోగులకు సేవలు అందించారు. ఇది 1954లో ప్రారంభం కాగా.. 70 ఏళ్లలో 7,12,92,000 మంది రోగులకు వైద్య సేవలు అందించింది. ఇక్కడ మొత్తం 25 వైద్య విభాగాలు ఉన్నాయి. ప్రతిరోజు సేవలకు ఎంజీఎం చేసే ఖర్చు రూ.1.75 కోట్లు. ఇవీ ఎంజీఎం విశేషాలు.

News August 24, 2024

నల్గొండ: కార్మికులు భద్రమేనా!

image

అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. చౌటుప్పల్, బీబీనగర్, BNR, బొమ్మలరామారం, పోచంపల్లి, త్రిపురారం, MLGలో సుమారు 100 వరకు ఫార్మా పరిశ్రమలున్నాయి. ప్రమాదాలు జరగకముందే కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

News August 24, 2024

ఖమ్మం: గుప్తనిధుల తవ్వకాలు.. నిందితులు ఆరెస్ట్

image

చంద్రుగొండ మండలం ఇమ్మడి రామయ్య బంజర్‌లో గుప్తనిధుల తవ్వకాలు జరిపిన 9మందిని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా ముందు హాజరు పరిచారు. అయ్యన్నపాలెంకి చెందిన బేతి నీలయ్య జామాయిల్ తోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ దామరచర్లకి చెందిన కర్రి రామకృష్ణ, నీలయ్యకు చెప్పాడు. పూజలు జరిపి తవ్వేందుకు ఖమ్మం జిల్లా కారేపల్లి, ఏపీలోని విస్సన్నపేటకు చెందిన వారిని తీసుకొచ్చాడని డీఎస్పీ చెప్పారు.

News August 24, 2024

నేడు కరీంనగర్‌లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

image

కరీంనగర్ జిల్లా స్థాయి యోగాసనా పోటీలు నేడు ఉదయం 10:30 గంటలకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యోగ క్రీడాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News August 24, 2024

సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

image

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News August 24, 2024

సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

image

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News August 24, 2024

కవితతో హరీశ్ రావు ములాఖత్

image

తిహార్‌ జైల్‌లో MLC కవితతో MLA హరీశ్‌రావు భేటీ అయ్యారు. శుక్రవారం ములాఖత్‌‌లో భాగంగా జైల్‌లో కవితను కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను ED అరెస్ట్‌ చేయగా, ఆ తర్వాత CBI అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఆమె జైలులో ఉన్నారు.