Telangana

News August 23, 2024

HYD: యూట్యూబర్ వంశీ కుమార్ ARREST

image

కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డబ్బులు విసిరి న్యూసెన్స్ క్రియేట్ చేసిన వంశీ కుమార్ (24) అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు వెదజల్లే వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి సీఐ ముత్తు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.

News August 23, 2024

HYD: యూట్యూబర్ వంశీ కుమార్ ARREST

image

కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డబ్బులు విసిరి న్యూసెన్స్ క్రియేట్ చేసిన వంశీ కుమార్ (24) అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు వెదజల్లే వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి సీఐ ముత్తు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.

News August 23, 2024

HYD: రూ.4 లక్షలు ఇవ్వనందుకు కిడ్నాప్ చేశారు..!

image

వీసా మంజూరు కోసం చెల్లించిన రూ.4 లక్షలను తిరిగి చెల్లించనందుకు ఇటీవల శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఆరుగురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో మెడిసిన్ చదువు కోసం SS కన్సల్టెన్సీ యజమాని శివశంకర్ రెడ్డికి రూ.4 లక్షలను బాధితులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో అతడిని కిడ్నాప్ చేశారని, నేడు వారిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేసి PSకి తరలించారు.

News August 23, 2024

HYD: రూ.4 లక్షలు ఇవ్వనందుకు కిడ్నాప్ చేశారు..!

image

వీసా మంజూరు కోసం చెల్లించిన రూ.4 లక్షలను తిరిగి చెల్లించనందుకు ఇటీవల శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఆరుగురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో మెడిసిన్ చదువు కోసం SS కన్సల్టెన్సీ యజమాని శివశంకర్ రెడ్డికి రూ.4 లక్షలను బాధితులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో అతడిని కిడ్నాప్ చేశారని, నేడు వారిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేసి PSకి తరలించారు.

News August 23, 2024

జగిత్యాలలో బాలిక సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్ పల్లెలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన హర్షిత(14) 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు హాస్టల్లో ఉండమని మందలించడంతో 2రోజుల క్రితం గడ్డి మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించింది. తండ్రి అంజిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News August 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,44,198 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.76,932, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,180, అన్నదానానికి రూ.16,086 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 23, 2024

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: అదనపు కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

News August 23, 2024

జిట్టా బాలకృష్ణకు తీవ్ర అస్వస్థత.. యశోదలో చికిత్స

image

తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పాత్ర పోషించారు. గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

News August 23, 2024

HYD: ‘బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేశారు. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని ప్రధాన డిమాండ్‌తో, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల, సంయుక్త సమావేశం నిర్వహించారు.

News August 23, 2024

HYD: ‘బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేశారు. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని ప్రధాన డిమాండ్‌తో, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల, సంయుక్త సమావేశం నిర్వహించారు.