Telangana

News September 25, 2024

‘HYDలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’

image

హైదరాబాద్‌లో సుప్రీం కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని, దానికోసం సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం కర్నూల్‌లో హై కోర్డు బెంచ్, అమరావతిలో లా యూనివర్సీటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

News September 25, 2024

‘HYDలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’

image

హైదరాబాద్‌లో సుప్రీం కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని, దానికోసం సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం కర్నూల్‌లో హై కోర్డు బెంచ్, అమరావతిలో లా యూనివర్సీటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

News September 25, 2024

BRS ఏం చేసిందో, కాంగ్రెస్ అదే చేస్తోంది: కూనంనేని

image

సింగరేణి లాభాలకు వాటా సంబంధించి ప్రభుత్వంపై విమర్శ చేసే క్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ బాధ్యత వహించాలని కేటిఆర్‌ చేసిన వ్యాఖ్యలను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తప్పుపట్టారు. BRS ప్రభుత్వం ఏమి చేసిందో, ఈ ప్రభుత్వం కూడా అదే చేసిందని చెప్పారు. BRS ప్రభుత్వం పాక్షికంగా కార్మికులకు వాటాలను పంచిందని చెప్పారు. రూ.4701 కోట్లు కాగా రూ.2412 కోట్ల నికర లాభాల నుండి 33% ఇచ్చారని అన్నారు.

News September 25, 2024

WGL: బస్ సౌకర్యం కల్పించాలనే అంశంపై స్పందన

image

తాటికొండ-ఘనపూర్ మధ్య బస్సు సర్వీస్ పునరుద్ధరణకై AISF జిల్లా కన్వీనర్ యునుస్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిపై TGSRTC వెంటనే స్పందించి ఈ అంశాన్ని పరిశీలించాలని DyRM(O)WLకు సూచించింది. బస్సు సర్వీస్ ప్రపోజల్ అంశాన్ని పరిశీలిస్తామని DyRM(O)WL ట్వీట్ చేశారు. ట్వీట్‌కు వెంటనే స్పందించినందుకు గాను ఆర్టీసీ అధికారులకు AISF నేతలు కృతజ్ఞతలు చెప్పారు.

News September 25, 2024

దామరచర్ల: హత్యాచార కేసు ఛేదన

image

దామరచర్ల మండలం ఓ తండాలో ఈనెల 14న జరిగిన హత్యాచార కేసును ఛేదించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. తండాకు చెందిన యువతిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

NZB: ప్రేమ నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి చెందిన 21 ఏళ్ల యువకుడు ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 10న పురుగుల మందు తగగా NZBలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

News September 25, 2024

MBNR: 10 రూపాయల నాణేల చలామణిలో అయోమయం!

image

ఉమ్మడి జిల్లాలో 10 రూపాయల నాణేల చలామణిలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ‌ నాణేలు చెల్లవంటూ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండడంతో వీటిని తీసుకోవడానికి, చెలామణి చేయడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. సరుకుల కొనుగోళ్ల సమయంలో చిల్లర కోసం దుకాణదారులు రూ.10 నోట్లకు బదులు నాణేలను ఇస్తే వాటిని తీసుకునేందుకు చాలామంది నిరాకరిస్తున్నారు. అధికారులు స్పందించి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

News September 25, 2024

వరంగల్: పతనమవుతున్న మొక్కజొన్న ధరలు!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రూ.2,590 పలికిన మక్కలు (బిల్టీ) నేడు రూ.2,575కి చేరింది. గత వారం ఊహించని స్థాయిలో రికార్డు ధర పలికిన మక్కలు క్రమంగా పతనమవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 25, 2024

కరీంనగర్: ఈ చిన్నారులు GREAT!

image

కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన 9వ తరగతి విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. పుప్పాల రిషికేష్, గంగిపల్లి రక్షిత్, నేరేడుకొమ్మ చంద్ర సాయి, కోతిరెడ్డి అనిరుధ్‌రెడ్డి మిత్రులు కలిసి కాలనీలో మొదటిసారి వినాయకుడిని ప్రతిష్ఠించారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేశారు. అయితే చందా ద్వారా వచ్చిన డబ్బులు మిగిలాయి. వాటితో 32 మంది పేద విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు.

News September 25, 2024

వరంగల్: 27న యోగా టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా శిక్షకుల నియామకం చేపడుతున్నట్లు ప్రాంతీయ ఆయుష్ శాఖ ఆర్ డీడీ ప్రమీలాదేవి, ఆయుష్ జిల్లా ఇన్‌ఛార్జి డా.తనుజారాణి తెలిపారు. యోగా టీచర్ల నియామాకానికి ఈ నెల 27న వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఆయుష్మాన్ ఆర్డీడీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.